స్వాతంత్య్ర వేడుకలకు హాజరై వెళ్తూ.. మహిళా ఉద్యోగి మృతి
స్వాతంత్య్ర వేడుకల్లో ఎంతో సంతోషంగా పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా ఉద్యోగి దుర్మరణం పాలైన సంఘటన అంతర్గాం మండలం కుందనపల్లి ఐవోసీీఏల్ ఏరియా వద్ద జరిగింది. రాజీవ్ రహదారిపై సోమవారం
వేడుకల్లో పి.మల్లమ్మ
అంతర్గాం, న్యూస్టుడే : స్వాతంత్య్ర వేడుకల్లో ఎంతో సంతోషంగా పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా ఉద్యోగి దుర్మరణం పాలైన సంఘటన అంతర్గాం మండలం కుందనపల్లి ఐవోసీీఏల్ ఏరియా వద్ద జరిగింది. రాజీవ్ రహదారిపై సోమవారం ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న సంఘటనలో పెద్దపల్లి అందుగులపల్లికి చెందిన పుట్ట మల్లమ్మ(57) మృతి చెందింది. మల్లమ్మ గోదావరిఖని మహిళా జూనియర్ కళాశాలలో అటెండర్గా పనిచేస్తున్నారు. కళాశాలలో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. పెద్దపల్లికి చెందిన దామరకొండ శంకర్ ద్విచక్ర వాహనంపై తిరిగి గోదావరిఖని నుంచి పెద్దపల్లికి బయల్దేరారు. కుందనపల్లి ఐవోసీీఎల్ ఏరియా దాటాక వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరూ కిందపడ్డారు. మల్లమ్మ తలకు బలమైన గాయమవగా కుడిచెయ్యి విరిగింది. అదే కారులో ఆమెను పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. శంకర్కు స్వల్ప గాయాలయ్యాయి. మల్లమ్మకు ఐదుగురు కుమార్తెలు.. కారు డ్రైవర్ చిందం వెంకటరావుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై బి.సంతోష్కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.