బాలుడిని బలిగొన్న మురుగు గుంత
గ్రామం మధ్యలో ఉన్న మురుగు గుంత మూడేళ్ల బాలుడిని బలిగొంది. అప్పటి వరకు ఆడుకుంటూ ఉన్న బాలుడు అందులో పడి మృత్యువాత పడ్డాడు. బాధితుల కథనం మేరకు.. మద్దూరు మండలంలోని ఎక్కమెడ్ గ్రామానికి చెందిన కాశమ్మ, మొగులప్ప
మద్దూరు, న్యూస్టుడే : గ్రామం మధ్యలో ఉన్న మురుగు గుంత మూడేళ్ల బాలుడిని బలిగొంది. అప్పటి వరకు ఆడుకుంటూ ఉన్న బాలుడు అందులో పడి మృత్యువాత పడ్డాడు. బాధితుల కథనం మేరకు.. మద్దూరు మండలంలోని ఎక్కమెడ్ గ్రామానికి చెందిన కాశమ్మ, మొగులప్ప దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. కాశమ్మ మొహర్రం సందర్భంగా పిల్లలతో కలిసి పుట్టినిలైన నిడ్జింతకు వచ్చారు. గురువారం మధ్యాహ్న సమయంలో ఆమె ఇంట్లో పని చేస్తుండగా.. చిన్న కుమారుడు విష్ణు (3) ఆడుకుంటూ ఇంటికి సమీపంలో గ్రామం మధ్యలో ఉన్న మురుగు గుంతలో పడిపోయాడు. కాసేపటి తరవాత కుమారుడు కనిపించడం లేదని కాశమ్మ వెతుకుతుండగా.. మురుగు గుంతలో పడిఉండటం గమనించారు. బయటకు తీసి మద్దూరు పీహెచ్సీకి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నిడ్జింత గ్రామం మధ్యలో ఉన్న మురుగు గుంత ప్రమాదకరంగా ఉంది. రెండేళ్ల కిందట 45 ఏళ్ల వ్యక్తి కూడా ప్రమాదవశాత్తు దీనిలోపడి మృతి చెందాడు. గుంతను పూడ్చాలని అధికారులకు విన్నవించినా స్పందించడం లేదని, ఇకనైనా పూడ్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!