పట్టపగలే చోరీ
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. దుండగులు సుమారు రూ.8.50 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పేర్కొన్నారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పడంపల్లి గ్రామానికి చెందిన గొర్రెల
రూ.8.50 లక్షల నగదు అపహరణ
ఆత్మకూర్, న్యూస్టుడే : వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. దుండగులు సుమారు రూ.8.50 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పేర్కొన్నారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పడంపల్లి గ్రామానికి చెందిన గొర్రెల వ్యాపారి గొల్ల కాటె గట్టు గురువారం ఇంటి పనిపై ఆత్మకూరుకు, భార్య వ్యవసాయ కూలీ పనులకు వెళ్లారు. ఇద్దరు కుమార్తెలు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆత్మకూరులో ప్రదర్శించిన గాంధీ సినిమా చూసేందుకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి రాగా.. తాళం విరగ్గొట్టి ఉండటాన్ని గమనించారు. చరవాణి ద్వారా తండ్రి గట్టుకు సమాచారం ఇచ్చారు. హటాహుటిన ఇంటికి వచ్చి పరిశీలించగా.. బీరువాలో దాచిన రూ.8.50 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. గొర్రెల వ్యాపారం కోసం నగదు తెచ్చి పెట్టుకున్నట్లు చెప్పారు. బాధితుడి సమాచారంతో సీఐ రత్నం, ఎస్ఐ రాఘవేంద్ర గ్రామానికి చేరుకొని పరిశీలించారు. వేలిముద్రల నిపుణులు, పోలీసు జాగిలాలను రప్పించి ఆధారాలు సేకరించారు.
రైతు ఇంట్లో 2 తులాల బంగారం, రూ.లక్ష నగదు..
ఆత్మకూర్ : పురపాలిక పరిధిలోని ఖానాపురం గ్రామంలో గురువారం సాయత్రం గుర్తు తెలియని వ్యక్తులు రైతు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. రైతు రామకృష్ణారెడ్డి వ్యవసాయ పనులకు వెళ్లగా, కుమారుడు వెంకటేశ్వర్రెడ్డి మధ్యాహ్నం భోజనం అనంతరం ఆత్మకూరులోని ఎరువుల దుకాణానికి వెళ్లారు. కళ్లు సరిగా కనిపించని రామకృష్ణారెడ్డి తల్లి రంగమ్మ ఇంట్లో పడుకొని ఉండగా.. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. సాయంత్రం రామకృష్ణారెడ్డి ఇంటికి రాగా.. బీరువా తెరిచి ఉండటం గమనించి వెళ్లి పరిశీలించగా.. అందులో ఉంచిన రూ.లక్ష నగదు, రెండు తులాల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. ఎస్ఐ రాఘవేంద్ర గ్రామానికి వెళ్లి వివరాలు నమోదు చేశారు. పోలీసు జాగిలం, వేలిముద్ర నిపుణులు ఇక్కడ కూడా ఆధారాలు సేకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. -
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!