హోంవర్క్‌ చేయలేదని..

హోంవర్క్‌ చేయలేదనే కారణంతో నాలుగో తరగతి చదువుతున్న బాలికను ఉపాధ్యాయురాలు విచక్షణా రహితంగా కొట్టిన సంఘటన మేదరమెట్లలోని ఓ ప్రైవేటు పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది. విద్యార్ధిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల

Updated : 19 Aug 2022 06:21 IST

చిన్నారిని చితకబాదిన ఉపాధ్యాయిని

దెబ్బలకు కమిలిన శరీరం

మేదరమెట్ల, న్యూస్‌టుడే: హోంవర్క్‌ చేయలేదనే కారణంతో నాలుగో తరగతి చదువుతున్న బాలికను ఉపాధ్యాయురాలు విచక్షణా రహితంగా కొట్టిన సంఘటన మేదరమెట్లలోని ఓ ప్రైవేటు పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది. విద్యార్ధిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. హోంవర్క్‌ చేయకుండా స్కూలుకు వెళ్లిన విద్యార్థిని ఉపాధ్యాయురాలు ప్రశ్నించడంతో పుస్తకాన్ని తరగతి గదిలోనే మర్చిపోయానని విద్యార్ధిని సమాధానం ఇవ్వడంతో ‘ఎదురు సమాధానం చెప్తావా’ అంటూ ఉపాధ్యాయిని కర్రతో విచక్షణా రహితంగా బాదడంతో బాలిక శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రుల వద్ద చెప్పుకొని బాధపడింది. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం, విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తల్లిదండ్రులు చెప్పారు. గతంలో కూడా ఈ పాఠశాలలో పలుమార్లు ఇటువంటి సంఘటలు జరిగినా పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడంతో తరచుగా ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎంఈవో పున్నయ్య వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. శనివారం బాలికను విచారించి తగిన చర్యలు చేపడతామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని