కుటుంబ కలహాలతో తల్లీకూతురు ఆత్మహత్య
కుటుంబంలో తరచూ కలహాలను భరించలేక ఆవేదన చెంది కన్నకూతురితో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలం జప్తిసింగాయపల్లి అటవీ ప్రాంతంలో జరిగింది. ములుగు మండలం వాగునూతి గ్రామానికి చెందిన సగ్గు ఐలయ్య, గంగమ్మ(50) దంపతులు.
ములుగు, న్యూస్టుడే: కుటుంబంలో తరచూ కలహాలను భరించలేక ఆవేదన చెంది కన్నకూతురితో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలం జప్తిసింగాయపల్లి అటవీ ప్రాంతంలో జరిగింది. ములుగు మండలం వాగునూతి గ్రామానికి చెందిన సగ్గు ఐలయ్య, గంగమ్మ(50) దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెను మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం తుర్కపల్లికి చెందిన వ్యక్తికి ఇచ్చ మూడేళ్ల క్రితం పెళ్లి చేయించారు. ఆమె గతేడాది అనారోగ్యంతో మృతి చెందింది. ఐలయ్య రెండో కుమార్తె జ్యోతి(25) మానసిక దివ్యాంగురాలు. కొడుకులు లేకపోవడంతో గంగమ్మ గతంలోనే భర్తకు తన బంధువర్గంలోని ఓ మహిళతో రెండో పెళ్లి చేసింది. కొద్దికాలం బాగానే ఉన్నా అనంతరం గంగమ్మను, ఆమె కుమార్తె మానసిక దివ్యాంగురాలైన జ్యోతిని కుటుంబంలో సరిగా చూడటం లేదు. తరచూ సవతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ కాగానే జ్యోతిని తీసుకొని గంగమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. గతంలో రెండుమూడు సార్లు అలా వెళ్లి చుట్టాలింట్లో ఉండి మళ్లీ వచ్చేది. ఈసారి తిరిగి రాలేదు. శుక్రవారం మధ్యాహ్నం జప్తిసింగాయపల్లి అటవీ ప్రాంతంలో కాలిపోయి ఉన్న ఇద్దరు మహిళల మృతదేహాలను గొర్ల కాపరులు చూసి పోలీసులకు చెప్పారు. ములుగు ఎస్ఐ రంగ కృష్ణ మృతదేహాలను పరిశీలించి గంగమ్మ, జ్యోతిగా గుర్తించారు. సవతితో కలహాల కారణంగానే గ్రామం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. ముందుగా తల్లీకూతురు తమ ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసి ఓ బట్టలో మూట కట్టి అక్కడే పక్కన ఉంచారు. వెంట తెచ్చుకున్న పెట్రోలు మీద పోసుకొని నిప్పంటించుకున్నారని పోలీసులు తెలిపారు. తాను చనిపోతే దివ్యాంగురాలైన కుమార్తె బతుకు కష్టమవుతుందనే బాధతోనే ఆమెతో పాటు బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని చెబుతున్నారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే