వ్యక్తి దారుణ హత్య

రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం రైల్వే పోలీసులు కనుగొన్నారు. రైల్వే, స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టి మృతదేహం శింగనమల మండలం కల్లుమడి గ్రామానికి చెందిన నగేష్‌(40)దిగా గుర్తించారు. సంఘటన స్థలంలో లభించిన ఆనవాళ్ల ఆధారంగా రైల్వే సీఐ నాగరాజు, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, శింగనమల సీఐ అస్రార్‌బాషా, స్థానిక ఎస్‌ఐ

Updated : 20 Aug 2022 04:29 IST

సంఘటన స్థలంలో జాగిలాలతో పరిశీలన

గార్లదిన్నె, న్యూస్‌టుడే: రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం రైల్వే పోలీసులు కనుగొన్నారు. రైల్వే, స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టి మృతదేహం శింగనమల మండలం కల్లుమడి గ్రామానికి చెందిన నగేష్‌(40)దిగా గుర్తించారు. సంఘటన స్థలంలో లభించిన ఆనవాళ్ల ఆధారంగా రైల్వే సీఐ నాగరాజు, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, శింగనమల సీఐ అస్రార్‌బాషా, స్థానిక ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌రెడ్డి జాగిలాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టి హత్యగా నిర్ధారించారు. నగేష్‌ను గురువారం రాత్రి ఇంటి నుంచి అదే గ్రామానికి చెందిన మునిస్వామి అనే వ్యక్తి తీసుకువెళ్లి కల్లుమడి, ఇల్లూరు గ్రామాల మధ్యలో హత్యచేసి ఎగువపల్లి సమీపంలో రైల్వే పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూశాడని చెప్పారు. చివరికి హత్యగా తేలడంతో నగేష్‌ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే కారణంగా హత్యకు కారణమని సమాచారం. హతుడికి భార్య నాగలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రధాన నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

నగేష్‌ (పాతచిత్రం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని