స్థల వివాదంతో పురుగు మందు తాగిన కొడుకు
ఒకే స్థలాన్ని ఇద్దరికి విక్రయించిన వ్యవహారంలో బాధితుడి కుటుంబంలోని తండ్రీ, కొడుకు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన పెద్దపల్లిలో శుక్రవారం కలకలం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి
మనస్తాపంతో ఒంటిపై డీజిల్ పోసుకుని తండ్రి ఆత్మహత్యా యత్నం
లారీ క్యాబిన్పై ఆత్మహత్యా యత్నం చేస్తున్న
మురళిని అడ్డుకుంటున్న స్థానికులు
పెద్దపల్లి, న్యూస్టుడే: ఒకే స్థలాన్ని ఇద్దరికి విక్రయించిన వ్యవహారంలో బాధితుడి కుటుంబంలోని తండ్రీ, కొడుకు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన పెద్దపల్లిలో శుక్రవారం కలకలం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పనాస మురళి గతంలో నూనె కొమురయ్య అనే వ్యక్తి నుంచి ఇంటి స్థలం కొనుగోలు చేశాడు. అందులో ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టాడు. అయితే సదరు స్థలాన్ని కొనుగోలు చేసినట్లు మరో వ్యక్తి వచ్చి గొడవ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై గ్రామంలో పలుమార్లు పంచాయితీలు జరిగినా ప్రయోజనం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మురళి కుమారుడు శ్రీనివాస్ గురువారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. అతడిని కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో ఆందోళన చెందిన మురళి శుక్రవారం తన లారీలో కుటుంబ సభ్యులతో కలిసి పెద్దపల్లికి వచ్చాడు. పట్టణంలోని బస్టాండ్ కూడలిలో రోడ్డుకు అడ్డంగా లారీని నిలిపి వెంట తెచ్చుకున్న డీజిల్ను ఒంటిపై పోసుకున్నాడు. గమనించిన స్థానికులు మురళిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి కేసు నమోదు చేయనున్నట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్