స్థల వివాదంతో పురుగు మందు తాగిన కొడుకు

ఒకే స్థలాన్ని ఇద్దరికి విక్రయించిన వ్యవహారంలో బాధితుడి కుటుంబంలోని తండ్రీ, కొడుకు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన పెద్దపల్లిలో శుక్రవారం కలకలం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి

Updated : 20 Aug 2022 05:09 IST

మనస్తాపంతో ఒంటిపై డీజిల్‌ పోసుకుని తండ్రి ఆత్మహత్యా యత్నం

లారీ క్యాబిన్‌పై ఆత్మహత్యా యత్నం చేస్తున్న

మురళిని అడ్డుకుంటున్న స్థానికులు

పెద్దపల్లి, న్యూస్‌టుడే: ఒకే స్థలాన్ని ఇద్దరికి విక్రయించిన వ్యవహారంలో బాధితుడి కుటుంబంలోని తండ్రీ, కొడుకు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన పెద్దపల్లిలో శుక్రవారం కలకలం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పనాస మురళి గతంలో నూనె కొమురయ్య అనే వ్యక్తి నుంచి ఇంటి స్థలం కొనుగోలు చేశాడు. అందులో ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టాడు. అయితే సదరు స్థలాన్ని కొనుగోలు చేసినట్లు మరో వ్యక్తి వచ్చి గొడవ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై గ్రామంలో పలుమార్లు పంచాయితీలు జరిగినా ప్రయోజనం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మురళి కుమారుడు శ్రీనివాస్‌ గురువారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. అతడిని కరీంనగర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో ఆందోళన చెందిన మురళి శుక్రవారం తన లారీలో కుటుంబ సభ్యులతో కలిసి పెద్దపల్లికి వచ్చాడు. పట్టణంలోని బస్టాండ్‌ కూడలిలో రోడ్డుకు అడ్డంగా లారీని నిలిపి వెంట తెచ్చుకున్న డీజిల్‌ను ఒంటిపై పోసుకున్నాడు. గమనించిన స్థానికులు మురళిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి కేసు నమోదు చేయనున్నట్లు ఎస్సై రాజేశ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని