Hyderabad News: బిడ్డకు జన్మనిచ్చి భార్య మృతి.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య
వారిద్దరు ప్రేమించుకున్నారు.. అమ్మాయి కుటుంబసభ్యులు అంగీకరించకపోయినప్పటికీ వివాహం చేసుకుని నగరానికి వచ్చి ఎంతో అన్యోన్యంగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు.
రెజిమెంటల్ బజార్, సికింద్రాబాద్: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. అమ్మాయి కుటుంబసభ్యులు అంగీకరించకపోయినప్పటికీ వివాహం చేసుకుని నగరానికి వచ్చి ఎంతో అన్యోన్యంగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వారి సంతోషాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో.. నవమాసాలు మోసిన బిడ్డను భర్త చేతిలో పెట్టి ఆ భార్య పురిట్లోనే కన్నుమూసింది. ఎంతో ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య ఇకలేదన్న బాధను భరించలేక ఆ భర్త కూడా తనువు చాలించాడు. దీంతో రోజుల చిన్నారి అనాథగా మిగిలిపోయింది. ఈ హృదయవిదారక ఘటన సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది.
సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట్ జిల్లా మక్తల్కు చెందిన ఉప్పరి ఆంజనేయులు కుమారుడు నవీన్ కుమార్ (28).. తన ఇంటిపక్కనే ఉండే భీమేశ్వరి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించక పోవడంతో ఏడాది క్రితం వివాహం చేసుకుని నగరానికి వచ్చి మౌలాలి ప్రగతినగర్లో నివాసముంటున్నారు. నవీన్ కుమార్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 18 వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో భీమేశ్వరికి పురిటి నొప్పులు రావడంతో పక్కింటి మహిళ సాయంతో ఆమెను నేరేడ్మెట్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రసవం అనంతరం భీమేశ్వరి పరిస్థితి విషమంగా ఉండటంతో తల్లితో పాటు శిశువును గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. శిశువును వెంటిలేటర్పై ఉంచారు. చికిత్స పొందుతున్న భీమేశ్వరి అదే రోజు రాత్రి ఆస్పత్రిలో మృతిచెందింది. చిన్నారి వెంటిలేటర్పై, మార్చురీలో భార్య మృతదేహం ఉండటంతో నవీన్ కుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బాధను భరించలేక రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
శుక్రవారం రాత్రి 8.55 గంటల సమయంలో సంజీవయ్య పార్కు రైల్వేస్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లుగా ఆర్పీఎఫ్ హోంగార్డు గుర్తించి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించగా మృతుడి జేబులో లభ్యమైన సెల్ఫోన్ ఆధారంగా అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం భార్యభర్తల మృతదేహాలు గాంధీ మార్చురీలో ఉన్నాయి. పుట్టిన చిన్నారి ఇదే ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఉండటం చూసిన వారిని కంటతడిపెట్టిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ