Vizag: కుమారుడి వివాహం చూడకుండానే.. దంపతుల దుర్మరణం
జీవితంలో ఎన్నోకష్టాలు అనుభవించారు. చిన్నాచితకా వ్యాపారాలు చేసుకుని నేడు మంచి స్థితికి చేరుకున్నారు. జీవితంలో స్థిరపడ్డారు. ఇటీవలే కుమారుడికి పెళ్లి నిశ్చయమైంది. ఈ వేడుకను కళ్లారా చూడకుండానే అనుకోని ప్రమాదంలో
ప్రమాదంలో నుజ్జయిన కారు
రణస్థలం, పీఎం పాలెం, న్యూస్టుడే: జీవితంలో ఎన్నోకష్టాలు అనుభవించారు. చిన్నాచితకా వ్యాపారాలు చేసుకుని నేడు మంచి స్థితికి చేరుకున్నారు. జీవితంలో స్థిరపడ్డారు. ఇటీవలే కుమారుడికి పెళ్లి నిశ్చయమైంది. ఈ వేడుకను కళ్లారా చూడకుండానే అనుకోని ప్రమాదంలో మృత్యుఒడికి చేరిపోయారు. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం సమీపంలోని జాతీయ రహదారిపై కందివలస గెడ్డ వంతెన వద్ద కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో దంపతులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
విశాఖ నగరంలోని కొమ్మాదిలో నివాసముంటున్న బగాది షణ్ముఖరావు(55), బగాది విజయలక్ష్మి(48)లు తమ కుమారుడు సంతోష్తో కలిసి శ్రీకాకుళం జిల్లా గార మండలం వత్సవలస గ్రామంలోని రాజమ్మతల్లి ఆలయానికి మొక్కు తీర్చుకోవడానికి శనివారం ఉదయం 5 గంటల సమయంలో బయలుదేరారు. మొక్కు తీర్చుకుని మధ్యాహ్నం 2 గంటల సమయంలో తిరిగి స్వగ్రామం వెళ్తుండగా కారు అదుపుతప్పి ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో షణ్ముఖరావు, విజయలక్ష్మి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కుమారుడు సంతోష్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన చేరుకున్నారు. ప్రమాద సమయంలో సంతోషే డ్రైవింగు చేస్తున్నాడు. ఇతనికి తీవ్ర గాయాలైనప్పటికీ తల్లిదండ్రుల వద్దే రోదిస్తూ ఉండిపోయాడు. జేఆర్పురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మొక్కు తీర్చుకునేందుకు వెళ్లి: మృతుల స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఓవీపేట. షణ్ముఖరావు 35 సంవత్సరాల కిందటే బతుకుతెరువు కోసం విశాఖ వెళ్లిపోయారు. అక్కడ వివిధ పనులు చేసుకుంటూ కొన్నాళ్ల పాటు మాల్కాపురం ప్రాంతంలో నివాసముండేవారు. కొమ్మాదిలో కొత్తగా ఇల్లు కొనుక్కొని అక్కడికి మకాం మార్చారు. వీరికి కుమార్తె ఝాన్సీ, కుమారుడు సంతోష్ ఉన్నారు. కుమార్తెకు వివాహమై అమెరికాలో నివాసముంటుంది. కుమారుడు మెరైన్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఇతనికి వివాహం నిశ్చయమైంది. ఈలోపు రాజమ్మ తల్లికి మొక్కు తీర్చుకుందామని కారులో వత్సవలస వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా మృత్యువు కబళించింది. ఈ ఘటనతో స్వగ్రామంలో, కొమ్మాదిలో విషాదం అలముకుంది.
బగాది షణ్ముఖరావు, విజయలక్ష్మి (పాత చిత్రాలు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.