సతి వెంటే పతి
భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో ఆ చిన్నారులు అనాథలుగా మిగిలారు. బంధువుల వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ రేగళ్ల గ్రామానికి చెందిన పాలిక సత్యనారాయణ (46), చందో(41)కు 25 ఏళ్ల క్రితం వివాహమైంది.
భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య
చింతపల్లి గ్రామీణం, న్యూస్టుడే: భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో ఆ చిన్నారులు అనాథలుగా మిగిలారు. బంధువుల వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ రేగళ్ల గ్రామానికి చెందిన పాలిక సత్యనారాయణ (46), చందో(41)కు 25 ఏళ్ల క్రితం వివాహమైంది. వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు సురేఖకు వివాహమైంది. సూర్రాజు, కిరణ్, చిన్నారి చదువుకుంటున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చందో గురువారం మృతి చెందారు. దీంతో ఆమె భర్త సత్యనారాయణ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. భార్యకు అంత్యక్రియలు నిర్వహించిన మరుసటి రోజే శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. బంధువులు వెంటనే 108 వాహనంలో లోతుగెడ్డ పీహెచ్సీకి, అక్కడి నుంచి విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందారు. ఒక్కరోజు వ్యవధిలో తల్లిదండ్రులు మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. తమకు దిక్కెవరు అంటూ రోదిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ