సతి వెంటే పతి

భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో ఆ చిన్నారులు అనాథలుగా మిగిలారు. బంధువుల వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ రేగళ్ల గ్రామానికి చెందిన పాలిక సత్యనారాయణ (46), చందో(41)కు 25 ఏళ్ల క్రితం వివాహమైంది.

Updated : 25 Sep 2022 05:49 IST

భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో ఆ చిన్నారులు అనాథలుగా మిగిలారు. బంధువుల వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ రేగళ్ల గ్రామానికి చెందిన పాలిక సత్యనారాయణ (46), చందో(41)కు 25 ఏళ్ల క్రితం వివాహమైంది. వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు సురేఖకు వివాహమైంది. సూర్రాజు, కిరణ్‌, చిన్నారి చదువుకుంటున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చందో గురువారం మృతి చెందారు. దీంతో ఆమె భర్త సత్యనారాయణ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. భార్యకు అంత్యక్రియలు నిర్వహించిన మరుసటి రోజే శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. బంధువులు వెంటనే 108 వాహనంలో లోతుగెడ్డ పీహెచ్‌సీకి, అక్కడి నుంచి విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందారు. ఒక్కరోజు వ్యవధిలో తల్లిదండ్రులు మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. తమకు దిక్కెవరు అంటూ రోదిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని