ఏఆర్ కానిస్టేబుల్ బలవన్మరణం
వ్యక్తిగత జీవితంపై విరక్తి చెందిన ఓ కానిస్టేబుల్ శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగో పట్టణ పోలీసుల వివరాల మేరకు.. నగరంలోని ఆజాద్నగర్కు చెందిన నాగరాజు, చౌడమ్మ దంపతుల కుమారుడు సురేష్
సురేష్ (పాత చిత్రం)
అనంత నేరవార్తలు, న్యూస్టుడే: వ్యక్తిగత జీవితంపై విరక్తి చెందిన ఓ కానిస్టేబుల్ శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగో పట్టణ పోలీసుల వివరాల మేరకు.. నగరంలోని ఆజాద్నగర్కు చెందిన నాగరాజు, చౌడమ్మ దంపతుల కుమారుడు సురేష్ (33) జిల్లా ఏఆర్ విభాగంలో 2011 నుంచి కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి 2018లో తన మేనమామ కూతురు మౌనికతో వివాహమైంది. కొన్ని నెలలు వైవాహిక జీవితం సవ్యంగా సాగినా.. అనంతరం వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో భార్య పుట్టినిల్లయిన తిరుపతికి వెళ్లిపోయింది. ఆరు నెలల కిందట విడాకులు మంజూరయ్యాయి. అప్పటి నుంచి సురేష్ తన వైవాహిక జీవితం నాశనమైందంటూ తల్లిదండ్రులతో బాధపడేవాడు. దీంతో పాటు ఉన్నత ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఉండేది. ఈ ఏడాది జులై 21 నుంచి మెడికల్ లీవ్ తీసుకుని, రాంనగర్ పార్కు సమీపంలో ఓ అద్దెగదిలో ఉండేవాడు. రోజు మాదిరిగానే శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో అల్పాహారం చేసి అద్దెగదికి వెళ్లాడు. అదే రోజు రాత్రి తండ్రి నాగరాజు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. శనివారం ఉదయం సైతం ఫోన్ చేయగా సమాధానం లేకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు అద్దె గదివద్దకు చేరుకుని పరిశీలించారు. తలుపులు బద్దలు కొట్టి చూడగా సురేష్ సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకుని విగతజీవిలా కనిపించాడు. ఎస్సై గంగాధర్ ఘటనాస్థలికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు.
పలు అనుమానాలు?
సురేష్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు నెలల కిందట రాంనగర్లో గదిని అద్దెకు తీసుకుని, దాన్ని కార్యాలయంగా చేసుకుని షేర్మార్కెట్ వ్యాపారం నిర్వహించేవాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దృష్టి సారించారు. చున్నీతో ఉరి వేసుకోవడంతో ఆడవాళ్లు ధరించే చున్నీ గదిలోకి ఎలా వచ్చిందనే విషయంపైనా అనుమానాలు ఉన్నాయి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు