ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురు యువకుల దుర్మరణం
నారాయణపేట జిల్లాలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన శనివారం అర్ధరాత్రి అనంతరం చోటుచేసుకొంది. బాధిత కుటుంబాల సభ్యులు, మరికల్
పంచాయితీకి వచ్చి ఇద్దరు.. పెద్దల పండగకు వస్తూ మరొకరు
మరికల్ (ధన్వాడ), న్యూస్టుడే : నారాయణపేట జిల్లాలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన శనివారం అర్ధరాత్రి అనంతరం చోటుచేసుకొంది. బాధిత కుటుంబాల సభ్యులు, మరికల్ ఎస్సై అశోక్బాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మరికల్ మండలంలోని బుడ్డగాని తండాకు చెందిన యువకుడు వాడ్యా కిషన్ ఇంటికి సంబంధించిన విషయంలో వివాదం నడుస్తోంది. దీనిపై మాట్లాడటానికి పెద్దలు పంచాయితీ పెడదామని నిర్ణయించడంతో హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్న వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని చంద్రానాయక్ తండాకు చెందిన వాడ్యా రాజేష్ (19), నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని బండతండాకు చెందిన డేగావత్ రాహుల్ (21)ను సాయంగా రప్పించుకున్నాడు. శనివారం అర్ధరాత్రి సమయంలో విందు చేసుకుందామని ముగ్గురు కలిసి మరికల్కు వచ్చారు. అక్కడ జాతీయ రహదారి పక్కన ఓ డాబాలో బిర్యానీ పొట్లాలు కట్టించుకొని లాల్కోట క్రాస్ రోడ్డు దిశగా ముగ్గురు ద్విచక్ర వాహనంపై వెళ్తూ.. తీలేర్ శివారులో మహబూబ్నగర్ వైపు నుంచి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వాహనాలు నడుపుతున్న డేగావత్ రాహుల్, నవీన్కుమార్ (38) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రికి తరలిస్తుండగా వాడ్య రాజేష్ మార్గమధ్యంలో మృతి చెందాడు. కిషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
పెద్దలకు సాంబ్రాని వేయాలని..
నారాయణపేట పట్టణంలోని కలాల్వాడి సుభాష్రోడ్డు వీధికి చెందిన నవీన్కుమార్ అదే జిల్లాలోని ఊట్కూరు మండలం తిప్రాస్పల్లి గ్రామానికి చెందిన విజయలక్ష్మిని పెళ్లి చేసుకొని, భార్య, ఇద్దరు కుమార్తెలతో రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నివాసం ఉంటున్నారు. హైదరాబాద్ శివారులోని ఓ ఇంజినీరింగ్ కళాశాల వాహన డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తల్లిదండ్రులు శనివారం పెద్దల పండుగ చేయడంతో ఆలస్యంగా అయినా పెద్దలకు సాంబాని వేద్దామని నవీన్కుమార్ విధులు ముగించుకొని షాద్నగర్ నుంచి రాత్రి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. అర్ధరాత్రి దాటాక తీలేర్ శివారులో జరిగిన దుర్ఘటనలో దుర్మరణం చెందాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్