దైవదర్శనానికి వెళ్తూ.. మృత్యుఒడికి

దైవదర్శనం కోసం కారులో బయల్దేరిన ఓ కుటుంబాన్ని విధి వెంటాడింది. రెయిలింగ్‌ రూపంలో మృత్యువు తల్లీకుమార్తెను బలిగొంది. తండ్రి, కుమారుడు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె సమీపంలో ఆదివారం

Updated : 26 Sep 2022 04:35 IST

కారులోకి రెయిలింగ్‌ దూసుకెళ్లి తల్లీకుమార్తె దుర్మరణం

తండ్రి, కుమారుడు క్షేమం

మృతిచెందిన జయంతి, కీర్తన

గార్లదిన్నె, న్యూస్‌టుడే: దైవదర్శనం కోసం కారులో బయల్దేరిన ఓ కుటుంబాన్ని విధి వెంటాడింది. రెయిలింగ్‌ రూపంలో మృత్యువు తల్లీకుమార్తెను బలిగొంది. తండ్రి, కుమారుడు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. నగరంలోని రామకోటి కాలనీకి చెందిన రఘువరరాజా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులతో కలిసి శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి ఆలయాన్ని దర్శించుకోవడానికి తెల్లవారుజామున సొంత కారులో బయలుదేరారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గార్లదిన్నె సమీపానికి రాగానే కారు అదుపు తప్పింది. దీంతో జాతీయ రహదారి పక్కన డివైడర్లకు అమర్చిన రెయిలింగ్‌ కారులోకి చొచ్చుకెళ్లింది. ప్రమాదంలో ఆయన భార్య జయంతి(42), కుమార్తె కీర్తన (10) అక్కడికక్కడే మృతిచెందారు. రఘువరరాజా, కుమారుడు సంకల్ప ప్రమాదం నుంచి బయటపడ్డారు. మృతదేహాలను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని