నీరు మింగింది.. కన్నీరు మిగిలింది
వర్షానికి గుంతలో చేరిన నీరు మూడు కుటుంబాల్లో కన్నీరు మిగిల్చింది. లోతు తెలియక లోపలికి దిగిన ముగ్గురు చిన్నారులను ఆ కుంట మింగేసింది
నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం
చిన్నారుల మృతదేహాల వద్ద విలపిస్తున్న కుటుంబీకులు
షాద్నగర్, షాద్నగర్ పట్టణం, న్యూస్టుడే: వర్షానికి గుంతలో చేరిన నీరు మూడు కుటుంబాల్లో కన్నీరు మిగిల్చింది. లోతు తెలియక లోపలికి దిగిన ముగ్గురు చిన్నారులను ఆ కుంట మింగేసింది. ఈ విషాద ఘటన షాద్నగర్ పురపాలికలోని సోలీపూర్ గ్రామ శివారులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. సోలీపూర్కు చెందిన అక్షిత్గౌడ్(8), ఫరీద్(12), సయీఫ్(7), సంజయ్కుమార్ కలిసి గ్రామ శివారులోని ఓ వెంచర్ వద్దకు వెళ్లారు. రోడ్డు మరమ్మతులకు కావాల్సిన మట్టి కోసం వెంచర్లో మున్సిపాలిటీకి కేటాయించిన స్థలంలో భారీగా గుంతలు తవ్వారు. వర్షాలకు ఓ గుంత నీటితో నిండింది. ఈత కొడదామన్న ఆసక్తితో నలుగురు చిన్నారులు అందులోకి దిగారు. సంజయ్కుమార్ కొంచెం దూరం వెళ్లి భయమేసి వెనిక్కి వచ్చేశాడు. మిగతా ముగ్గురు నీటిలో పడి గిలగిల్లాడుతుండటంతో వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి గ్రామస్థులకు చెప్పాడు. బాలుర కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హుటాహుటిన చేరుకొనేసరికే ముగ్గురూ నీటిలో మునిగి మృత్యు ఒడికి చేరారు. ఏసీపీ కుషాల్కర్, సీఐ నవీన్కుమార్ మృతదేహాలను బయటకు తీయించి షాద్నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. వెంచర్లో తవ్విన గుంతలే తమ పిల్లల ప్రాణాలు తీశాయని, తమకు న్యాయం కావాలని చిన్నారుల కుటుంబ సభ్యులు పట్టణ కూడలిలో, కమ్యూనిటీ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. న్యాయం జరిగేలా చూస్తానని ఏసీపీ కుషాల్కర్, తహసీల్దార్ గోపాల్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
కొత్త బట్టలు కావాలి నాన్నా..: దసరాకు కొత్తబట్టలు కావాలని ఉదయమే అక్షిత్గౌడ్ మారాం చేశాడని.. ఇంతలోనే ఇలా జరిగిందని తండ్రి భిక్షపతి వాపోయాడు. ఆయన ముగ్గురు కుమారుల్లో అక్షిత్ చిన్నవాడు.
అన్నదమ్ముల ఇళ్లలో విషాదం: నయీమ్, సలీంలు సొంత అన్నదమ్ములు. నయీమ్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా పెద్దకుమారుడు ఫరీద్ ఈ ఘటనలో కన్నుమూశాడు. సలీం దంపతులకు సయీఫ్తోపాటు కుమార్తె ఉండగా, కుమారుడు ఇదే ఘటనలో మృత్యువాత పడ్డాడు. దీంతో రెండు ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!