జల్సాలకు అలవాటుపడి చోరీలు
ఎనిమిది మంది యువకులు జల్సాలకు అలవాటు పడ్డారు. వీటికోసం ఎలాగైనా డబ్బులను సంపాదించాలనే ఉద్దేశంతో చోరీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇలా దొంగతనాలకు పాల్పడుతూ ఖమ్మం పోలీసులకు చిక్కారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో జరిగిన 28 చోరీ కేసుల్లో ఎనిమిది మంది నిందితులను
ఎనిమిది మంది నిందితుల అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, చిత్రంలో ఏసీపీలు ఆంజనేయులు, రవి,
ప్రసన్నకుమార్, స్వాధీనం చేసుకున్న ఆభరణాలు
ఖమ్మం నేరవిభాగం, న్యూస్టుడే: ఎనిమిది మంది యువకులు జల్సాలకు అలవాటు పడ్డారు. వీటికోసం ఎలాగైనా డబ్బులను సంపాదించాలనే ఉద్దేశంతో చోరీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇలా దొంగతనాలకు పాల్పడుతూ ఖమ్మం పోలీసులకు చిక్కారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో జరిగిన 28 చోరీ కేసుల్లో ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ వివరించారు. నగరంలోని పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితులతో పాటు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాలు, నగదు వివరాలు వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని ముస్తఫానగర్లో కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారనే సమాచారంతో ఖమ్మం ఒకటోపట్టణ పోలీసులు, సీసీఎస్ పోలీసులు నిందితులు సూర్యాపేట జిల్లా నడిగూడెం కాగిత రామచంద్రాపురం గ్రామానికి చెందిన నూకమళ్ల నాగేంద్రబాబు, పప్పుల రాజ్కుమార్ అలియాస్ పండు, బాదే నాగేంద్రబాబు, మండల అశోక్, బాణాల ముత్యాలు, చింతమల్ల వెంకన్న, కులకులపల్లి మహేశ్తో పాటు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన తెలగమల్ల వెంకటేశ్వర్లు అలియాస్ రవిలను అదుపులోకి తీసుకొని విచారించారు. జల్సాలకు అలవాటు పడిన వీరు నేరప్రవృత్తిని ఎంచుకొని పలుచోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది. దొంగిలించిన బంగారాన్ని వీరి వద్ద నుంచి కొనుగోలు చేసిన గాంధీచౌక్లోని జ్ఞానేశ్వరి బంగారం దుకాణానికి చెందిన ఎలబోయిన కృష్ణనూ నిందితుడిగా చేర్చినట్లు సీపీ తెలిపారు. వీరు ఖమ్మం నగరంలో 27 ఇళ్లలో, సూర్యాపేట జిల్లాలో 1 ఇంటిలో బంగారు, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు చోరీ చేశారు. దొంగిలించిన డబ్బుతో నూకమళ్ల నాగేంద్రబాబు, పప్పుల రాజ్కుమార్ గోవా, విశాఖపట్నం ప్రాంతాల్లో తిరుగుతూ విలాసవంతమైన జీవితాన్ని గడిపారు.
రూ.42 లక్షల విలువైన సొత్తు రివకరీ: గత రెండేళ్లలో ఒకటో పట్టణ ఠాణా పరిధిలో 15, ఖానాపురం హవేలి ఠాణా పరిధిలో 10, ఖమ్మం రెండో పట్టణ ఠాణా పరిధిలో 2 ఇళ్లలో, సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీసు ఠాణా పరిధిలో ఒక ఇంటిలో చోరీలు చేశారు. నిందితుల నుంచి 638 గ్రాముల బంగారు నగలు, 2 కిలోల వెండి, 10 ఎల్ఈడీ టీవీలు, 3 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. బంగారం, వెండి విలువ సుమారుగా రూ.42లక్షల వరకు ఉంటుందని వివరించారు. ఇటీవల టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ సమీపంలోని దేవాలయంలో జరిగిన చోరీలో నిందితులను గుర్తించామని, త్వరలోనే వారిని చట్టం ముందుకు తీసుకొస్తామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా మేముసైతం కార్యక్రమంలో భాగస్వాములై సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఈ సందర్భంగా అభినందించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీలు రవి, ఆంజనేయులు, ప్రసన్నకుమార్, సీఐలు మల్లయ్యస్వామి, నవీన్, చిట్టిబాబు, శ్రీధర్, సర్వయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు