చరవాణికి ఛార్జింగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృత్యువాత

చరవాణి ఛార్జింగ్‌ పెడుతూ విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ మండలం బిజ్వారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏఎస్సై ఈశ్వరయ్య కథనం ప్రకారం.. బిజ్వారం గ్రామానికి చెందిన జ్యోతి (22), నరేష్‌ దంపతులు సొంత

Updated : 01 Oct 2022 06:12 IST

జ్యోతి

మల్దకల్‌, న్యూస్‌టుడే : చరవాణి ఛార్జింగ్‌ పెడుతూ విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ మండలం బిజ్వారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏఎస్సై ఈశ్వరయ్య కథనం ప్రకారం.. బిజ్వారం గ్రామానికి చెందిన జ్యోతి (22), నరేష్‌ దంపతులు సొంత పొలంలో రేకులతో ఇంటిని నిర్మించుకున్నారు. వర్షాలతో ఇంటికి విద్యుత్తు ప్రసారం కాగా, శుక్రవారం ఉదయం జ్యోతి చరవాణికి ఛార్జింగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. బయట ఉన్న నరేష్‌ తల్లి లోపలికి వచ్చేలోపే ఆమె మృత్యువాత పడింది. జ్యోతి తల్లి శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై ఈశ్వరయ్య తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని