రోజువారీ అంశాలే.. మాయగాళ్ల అస్త్రాలు
మాదాపూర్కు చెందిన ఓ వ్యక్తికి ఫోన్కాల్ వచ్చింది. దేశవ్యాప్తంగా సిమ్కార్డులను లాటరీ తీస్తే అతడి నంబర్కు రూ.25లక్షలు వచ్చాయంటూ నమ్మకం కలిగించారు. సొమ్ము జమచేసేందుకు పన్నులు చెల్లించాలంటూ రూ.4.5లక్షలు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు.
ఈనాడు, హైదరాబాద్
* మాదాపూర్కు చెందిన ఓ వ్యక్తికి ఫోన్కాల్ వచ్చింది. దేశవ్యాప్తంగా సిమ్కార్డులను లాటరీ తీస్తే అతడి నంబర్కు రూ.25లక్షలు వచ్చాయంటూ నమ్మకం కలిగించారు. సొమ్ము జమచేసేందుకు పన్నులు చెల్లించాలంటూ రూ.4.5లక్షలు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు.
* ముషీరాబాద్లో ఓ వయోధికుడికి విద్యుత్తు బిల్లు బకాయి చెల్లించకుంటే సరఫరా నిలిపివేస్తామంటూ భయపెట్టారు. మొబైల్కు లింకు పంపి ఖాతాలోని రూ.లక్ష స్వాహా చేశారు.
* ప్రస్తుతం కొత్త తరహాలో రూ.లక్షల విలువైన ఐఫోన్లు రూ.2500-3000కే గెలుచుకున్నారంటూ మోసాలకు పాల్పడుతున్నారు.
ఇలా దైనందిన జీవితంలో నిత్యావసరంగా మారిన సేవలను అందిస్తామనే ముసుగులో సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో 8 నెలల్లో సైబర్ మోసాలపై 4,500-5000 కేసులు నమోదైనట్టు అంచనా. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 40-50శాతం కేసులు పెరిగినట్టు భావిస్తున్నారు.
డబ్బు వస్తుందని ఉచ్చులో చిక్కి..
అవతలి వారి భయం, ఆశను సొమ్ము చేసుకోవటమే మోసగాళ్ల లక్ష్యమంటున్నారు నగర సైబర్క్రైమ్ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్. తేలిక మార్గంలో డబ్బు వస్తుందనే భ్రమలో ఉన్న ఎక్కువ మంది ఉచ్చులో పడుతున్నారని సైబరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ జి.శ్రీధర్ తెలిపారు. మోసపోయినట్టు గుర్తించగానే 100, 1930 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
-
ముంబయి జట్టుకు ఎక్కువ కాలం ఆడితే బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన