మూడుముళ్ల బంధం.. అనుమానంతో అంతం
సమీప గృహాల్లో ఉండే వారిద్దరూ కులాలు వేరైనా పెద్దల్ని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలంపాటు అన్యోన్యంగా సాగిన వారు అంతలోనే దూరమయ్యారు. ఈ క్రమంలోనే భార్యపై అనుమానంతో ఆమెను అంతం చేశాడు.
భార్యను హత్య చేసిన భర్త
విజయలక్ష్మి (పాతచిత్రం)
సత్తెనపల్లి, న్యూస్టుడే: సమీప గృహాల్లో ఉండే వారిద్దరూ కులాలు వేరైనా పెద్దల్ని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలంపాటు అన్యోన్యంగా సాగిన వారు అంతలోనే దూరమయ్యారు. ఈ క్రమంలోనే భార్యపై అనుమానంతో ఆమెను అంతం చేశాడు. సత్తెనపల్లిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టణ సీఐ శోభన్బాబు వివరాల మేరకు.. అచ్చంపేట రోడ్డులోని రైల్వేగేటు అవతల రోడ్డు పక్కనే ముఠాకూలీ పసుపులేటి నాగరాజు, చిన్నం విజయలక్ష్మి కుటుంబాలు ఉంటున్నాయి. నాగరాజు, విజయలక్ష్మి(40) ప్రేమించుకుని 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారి వివాహ బంధం కొంతకాలం బాగానే ఉంది. భార్యపై అనుమానం రావడంతో ఐదారేళ్లుగా మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం వారిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో నాగరాజు తల్లిదండ్రుల వద్ద ఉంటుండగా విజయలక్ష్మి ఇంట్లోనే కుట్టుమిషన్ పెట్టుకుని కుమార్తె మీనాక్షిని చదివించుకుంటూ జీవనం సాగించేది. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం దంపతుల మధ్య సయోధ్య కుదరడంతో మళ్లీ కలిసి ఉంటున్నారు. అయితే భార్య వివాహేతర సంబంధం నెరుపుతోందనే కారణంతో అతడు గొడవపడి నాలుగు నెలలుగా మళ్లీ భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తనకు విడాకులు ఇవ్వాలని భార్య ఇటీవల నోటీసు పంపడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఆదివారం భార్య వద్దకు వెళ్లగా గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇనుప బద్దతో విజయలక్ష్మి తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి హత్యతో ఎనిమిదో తరగతి చదువుతున్న కుమార్తె మీనాక్షి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. నాగరాజు పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. హతురాలి సోదరి నాగేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!