కొబ్బరిబొండాల మాటున గంజాయి
కొబ్బరిబొండాల మాటున భారీఎత్తున గంజాయి రవాణా చేస్తోన్న అంతర్రాష్ట్ర ముఠా రాచకొండ పోలీసులకు చిక్కింది. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా నుంచి హైదరాబాద్ మీదుగా డీసీఎంలో మహారాష్ట్రకు తరలిస్తుండగా యాదాద్రి- భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని వరంగల్ జాతీయ రహదారిపై పట్టుబడింది.
ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు
900 కిలోలు స్వాధీనం.. నలుగురి అరెస్టు
డీసీఎంలో బస్తాల మాటున గంజాయి
ఈనాడు- హైదరాబాద్: కొబ్బరిబొండాల మాటున భారీఎత్తున గంజాయి రవాణా చేస్తోన్న అంతర్రాష్ట్ర ముఠా రాచకొండ పోలీసులకు చిక్కింది. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా నుంచి హైదరాబాద్ మీదుగా డీసీఎంలో మహారాష్ట్రకు తరలిస్తుండగా యాదాద్రి- భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని వరంగల్ జాతీయ రహదారిపై పట్టుబడింది. ఇంత పెద్దమొత్తంలో గంజాయి పట్టుబడడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. ఎల్బీనగర్ ఎస్వోటీ బృందం, ఆలేరు పోలీసుల సహకారంతో నలుగుర్ని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2 కోట్ల విలువైన 900 కిలోల గంజాయి, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్న డీసీఎం, కొబ్బరిబోండాలు, ఐదు సెల్ఫోన్లు, రూ.3,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ సోమవారం నేరేడ్మెట్లోని కమిషనరేట్లో విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.
గతంలో నాలుగుసార్లు..
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాకు చెందిన యోగేశ్ దత్తు గైక్వాడ్ ఈ ముఠా ప్రధాన సూత్రధారి. ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి తెప్పించుకుని మహారాష్ట్రలో విక్రయించేందుకు తన మిత్రులు అహ్మద్నగర్ జిల్లాకు చెందిన పెయింటర్ వికాస్ బాబన్ సాల్వే(28), కూలీ పనులు చేసుకునే వినోద్ చంద్ర వంకాల్కర్(26), డ్రైవర్ కిషోర్ తులసీరామ్ వాడేకర్(24)ను సంప్రదించాడు. కమిషన్ ఆశ చూపి గంజాయి తరలించేందుకు ఒప్పించాడు. వీరికి మల్కన్గిరి జిల్లాకు చెందిన సరఫరాదారు పలాసి కర్రయ్యను(28) పరిచయం చేశాడు. అతడి నుంచి రూ.3వేల చొప్పున కిలో గంజాయి కొని మహారాష్ట్రలో రూ.20 వేలకు విక్రయించేవాడు. ఇలా నాలుగుసార్లు హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలించాడు. వీరు యోగేశ్ దత్తుకు లోడు అందించి తమ వంతు వాటా తీసుకుంటారు.
రావులపాలెంలో రూ.లక్ష వెచ్చించి
కొన్ని వారాల క్రితం యోగేశ్ దత్తు సూచన మేరకు వికాస్ బాబన్ సాల్వే, వినోద్ చంద్ర, తులసీరామ్ వాడేకర్ ముగ్గురు డీసీఎంతో తూగో జిల్లా రావులపాలెం దగ్గర రూ.లక్షకుపైనే వెచ్చించి కొబ్బరిబొండాలు నింపిన బస్తాలను కొని మల్కన్గిరి జిల్లా వెళ్లి పలాసికర్రయ్య దగ్గర గంజాయి కొన్నారు. దాన్ని బస్తాల్లో సర్ది కొబ్బరిబోండాల కింద వేశారు. వీరికి దారి చూపించేందుకు 19 ఏళ్ల చిట్టిబాబు వచ్చాడు. సమాచారం అందుకున్న ఎస్వోటీ ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ ఎ.సుధాకర్.. ఆలేరు పోలీసుల సాయంతో వరంగల్- యాదాద్రి రహదారిపై మాటు వేసి నలుగుర్ని అరెస్టు చేశారు. యోగేశ్ దత్తు, పలాసి కర్రయ్య పరారీలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధిక వడ్డీల ఆశజూపి.. భారీ మోసం!
తమ సంస్థలో పెట్టుబడులు పెడితే.. అధిక వడ్డీతో పాటు తక్కువ సమయంలోనే భారీగా ఆర్జించవచ్చని మాయమాటలతో నమ్మించిన దంపతులు బోర్డు తిప్పేసిన ఘటన హైదరాబాద్ ఉప్పల్లో చోటుచేసుకుంది. -
కోల్కతాలో కుప్పకూలిన అయిదంతస్తుల భవనం.. తొమ్మిది మంది మృతి
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఓ అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
హార్డ్డిస్కులను అడవిలో పడేసిన ప్రణీత్రావు!
పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్సైబీ)లోని హార్డ్డిస్కులను కట్టర్లతో కత్తిరించి, వికారాబాద్ అడవిలో పడేసినట్లు రెండోరోజు విచారణలో డీఎస్పీ ప్రణీత్రావు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. -
పెళ్లి కారు, ట్రాక్టర్ ఢీ.. బిహార్లో 9 మంది మృతి
బిహార్లోని ఖగారియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, పెళ్లి కారు ఢీ కొన్న ఘటనలో 9 మంది మరణించారు. -
నకిలీ ఔషధ రాకెట్ కేసులో ఈడీ దాడులు
దేశ రాజధాని దిల్లీలో బయటపడిన నకిలీ ఔషధ రాకెట్ గుట్టును ఛేదించే క్రమంలో ఈడీ దాదాపు 10 ప్రదేశాల్లో దాడులు చేసింది. ముఠా ప్రధాన సూత్రధారులు విపిల్ జైన్, నీరజ్ చౌహన్, సూరజ్ షాత్, అభినవ్, తుషార్ చౌహాన్లతో సహా వారి సహచరుల ఇళ్లల్లోను ఈడీ దాడులు చేసింది. -
రూ.5.73 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఈదులగూడ వద్ద సోమవారం పట్టణం నుంచి కోదాడ వైపు వెళ్తున్న టీఎస్ 09 యూఈ 2479 నంబరు గల బొలేరో వాహనంలో రూ.5.73 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చందనా దీప్తి పేర్కొన్నారు. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్ద చోరీ.. ఆపై అడ్డంగా దొరికారు
ఓ వ్యక్తి మెడలో ఉన్న గొలుసును చోరీ చేసిన ఇద్దరు దొంగలు చివరకు పోలీసుల చేతికి చిక్కి, కటకటాల పాలయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
TS News: వ్యూహం మార్చి.. దూకుడు పెంచి.. త్వరలో మరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి
-
ఇదీ పది పరీక్షల తీరు!
-
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
-
రుషికొండలో ఏం జరిగింది?!
-
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
-
Israel: హమాస్కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం