జైల్లో పరిచయాలు.. చోరీ సొత్తుతో జల్సాలు
జల్సాలకు అలవాటుపడిన నేరస్థులు ముఠాగా ఏర్పడ్డారు. చోరీ సొత్తును తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బులతో విలాస జీవనం గడిపేవారు. దొంగతనాల తీరు, ఆభరణాలు నగదుగా మార్చుకోవడం సినీఫక్కీలో జరుగుతున్న వైనం చూసి పోలీసులు అవాక్కయ్యారు.
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ వినీత్
కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్టుడే: జల్సాలకు అలవాటుపడిన నేరస్థులు ముఠాగా ఏర్పడ్డారు. చోరీ సొత్తును తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బులతో విలాస జీవనం గడిపేవారు. దొంగతనాల తీరు, ఆభరణాలు నగదుగా మార్చుకోవడం సినీఫక్కీలో జరుగుతున్న వైనం చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఆయా వివరాలను కొత్తగూడెం డీఎస్పీ జి.వెంకటేశ్వరబాబు, మూడో పట్టణ ఠాణా ఎస్హెచ్ఓ ఎం.అబ్బయ్యలతో కలిసి ఎస్పీ వినీత్ సోమవారం తన కార్యాలయంలో వెల్లడించారు. కొత్తగూడెం కూలీలైన్కు చెందిన షేక్ ఇర్ఫాన్ అలియాస్ చోటుకు చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేసే అలవాటు ఉంది. 2012లో గాయత్రి ఆసుపత్రిలో ఫోన్ దొంగతనం చేసి బాల నేరస్థుడిగా ఖమ్మం చిల్డ్రన్ హోంలో గడిపాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా పలు ఆసుపత్రుల్లో విలువైన సెల్ఫోన్లు మాయం చేశాడు. ఈ ఏడాది మే నెలలో కొత్తగూడెం వన్టౌన్ పరిధిలో ఓ ఇంట్లో చోరీ చేసి భద్రాచలం జైలుకెళ్లాడు. ఆ సమయంలో పోక్సో కేసు నిందితుడైన విజయ్, పాల్వంచకు చెందిన మరో దొంగ చల్లా వెంకట్లతో పరిచయం ఏర్పడింది. వారు బయటకు వచ్చాక ముఠాగా ఏర్పడి రాత్రివేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు తెగబడ్డారు.
జూన్లో ఇర్ఫాన్, వెంకట్లు వన్ టౌన్లో మూడుచోట్ల చోరీలకు పాల్పడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వాటిల్లో కొన్ని విజయ్కి ఇవ్వగా.. అతడు భద్రాచలంలో ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి నగదు తెచ్చి ఇచ్చాడు. ఎవరి వాటాలు వారు పంచుకోగా.. తనకు వచ్చిన రూ.50 వేలను సోదరి జి.వసంతకు వెంకట్ ఇచ్చాడు. తర్వాత ఇల్లెందుకు చెందిన బాల్య మిత్రుడు అజీమ్తో జతకట్టిన ఇర్ఫాన్ త్రీటౌన్ పరిధిలోని గాజులరాజం బస్తీ, గణేశ్ టెంపుల్ ఏరియాల్లో పలు ఇళ్లలో బంగారు నగలు చోరీ చేశాడు. సొత్తును హైదరాబాద్లో ఓ ‘ఈ-కామర్స్’ సంస్థ డెలివరీ బాయ్గా పనిచేసే అజీమ్ అక్కడి మణప్పురం సంస్థలో తాకట్టు పెట్టాడు. వచ్చిన డబ్బులతో నిందితులు మైసూరు, వైజాగ్ వంటి పర్యాటక కేంద్రాలకు వెళ్లి విలాస జీవితాన్ని గడిపేవారు. ఇటీవల కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద చేపట్టిన తనిఖీల్లో ఇర్ఫాన్, అజీమ్లు పట్టుబడ్డారు. నిందితుల నుంచి 78 గ్రాముల బంగారు, 200 గ్రాముల వెండి ఆభరణాలు, మూడు సెల్ఫోన్లు, రూ.లక్ష నగదు రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఫైనాన్స్ సంస్థల నుంచి మరో 81 గ్రాముల బంగారు నగలను రికవరీ చేయాల్సి ఉందని, చోరీకి గురైన రూ.13 లక్షల సొత్తుతో రూ.9.44 విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన ఇద్దరిని జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపర్చామన్నారు. మిగిలిన ఇద్దరు నిందితులను త్వరలోనే అరెస్టు చేయనున్నట్టు వినీత్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
చైనాకు చెందిన ఓ మహిళ(31) అగ్నిపర్వతం అంచున ఫొటో తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మరణించిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్రిజిస్ట్రార్ తస్లీమ మహ్మద్ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం
ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. -
మహిళపై అమానుషానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు!
మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. -
ఏపీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడి అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడు బోయ మహానందిని మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
వైద్య విద్య కోసం కిర్గిజ్స్థాన్ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు.. రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి. -
పంట నష్టాలతో రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు మాకుల తండాలో ఇస్లావత్ చీనా(42) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టం, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రాళ్లు విసిరి.. జెండా కర్రలతో కొట్టి
తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. -
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు
పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM