జైల్లో పరిచయాలు.. చోరీ సొత్తుతో జల్సాలు
జల్సాలకు అలవాటుపడిన నేరస్థులు ముఠాగా ఏర్పడ్డారు. చోరీ సొత్తును తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బులతో విలాస జీవనం గడిపేవారు. దొంగతనాల తీరు, ఆభరణాలు నగదుగా మార్చుకోవడం సినీఫక్కీలో జరుగుతున్న వైనం చూసి పోలీసులు అవాక్కయ్యారు.
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ వినీత్
కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్టుడే: జల్సాలకు అలవాటుపడిన నేరస్థులు ముఠాగా ఏర్పడ్డారు. చోరీ సొత్తును తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బులతో విలాస జీవనం గడిపేవారు. దొంగతనాల తీరు, ఆభరణాలు నగదుగా మార్చుకోవడం సినీఫక్కీలో జరుగుతున్న వైనం చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఆయా వివరాలను కొత్తగూడెం డీఎస్పీ జి.వెంకటేశ్వరబాబు, మూడో పట్టణ ఠాణా ఎస్హెచ్ఓ ఎం.అబ్బయ్యలతో కలిసి ఎస్పీ వినీత్ సోమవారం తన కార్యాలయంలో వెల్లడించారు. కొత్తగూడెం కూలీలైన్కు చెందిన షేక్ ఇర్ఫాన్ అలియాస్ చోటుకు చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేసే అలవాటు ఉంది. 2012లో గాయత్రి ఆసుపత్రిలో ఫోన్ దొంగతనం చేసి బాల నేరస్థుడిగా ఖమ్మం చిల్డ్రన్ హోంలో గడిపాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా పలు ఆసుపత్రుల్లో విలువైన సెల్ఫోన్లు మాయం చేశాడు. ఈ ఏడాది మే నెలలో కొత్తగూడెం వన్టౌన్ పరిధిలో ఓ ఇంట్లో చోరీ చేసి భద్రాచలం జైలుకెళ్లాడు. ఆ సమయంలో పోక్సో కేసు నిందితుడైన విజయ్, పాల్వంచకు చెందిన మరో దొంగ చల్లా వెంకట్లతో పరిచయం ఏర్పడింది. వారు బయటకు వచ్చాక ముఠాగా ఏర్పడి రాత్రివేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు తెగబడ్డారు.
జూన్లో ఇర్ఫాన్, వెంకట్లు వన్ టౌన్లో మూడుచోట్ల చోరీలకు పాల్పడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వాటిల్లో కొన్ని విజయ్కి ఇవ్వగా.. అతడు భద్రాచలంలో ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి నగదు తెచ్చి ఇచ్చాడు. ఎవరి వాటాలు వారు పంచుకోగా.. తనకు వచ్చిన రూ.50 వేలను సోదరి జి.వసంతకు వెంకట్ ఇచ్చాడు. తర్వాత ఇల్లెందుకు చెందిన బాల్య మిత్రుడు అజీమ్తో జతకట్టిన ఇర్ఫాన్ త్రీటౌన్ పరిధిలోని గాజులరాజం బస్తీ, గణేశ్ టెంపుల్ ఏరియాల్లో పలు ఇళ్లలో బంగారు నగలు చోరీ చేశాడు. సొత్తును హైదరాబాద్లో ఓ ‘ఈ-కామర్స్’ సంస్థ డెలివరీ బాయ్గా పనిచేసే అజీమ్ అక్కడి మణప్పురం సంస్థలో తాకట్టు పెట్టాడు. వచ్చిన డబ్బులతో నిందితులు మైసూరు, వైజాగ్ వంటి పర్యాటక కేంద్రాలకు వెళ్లి విలాస జీవితాన్ని గడిపేవారు. ఇటీవల కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద చేపట్టిన తనిఖీల్లో ఇర్ఫాన్, అజీమ్లు పట్టుబడ్డారు. నిందితుల నుంచి 78 గ్రాముల బంగారు, 200 గ్రాముల వెండి ఆభరణాలు, మూడు సెల్ఫోన్లు, రూ.లక్ష నగదు రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఫైనాన్స్ సంస్థల నుంచి మరో 81 గ్రాముల బంగారు నగలను రికవరీ చేయాల్సి ఉందని, చోరీకి గురైన రూ.13 లక్షల సొత్తుతో రూ.9.44 విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన ఇద్దరిని జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపర్చామన్నారు. మిగిలిన ఇద్దరు నిందితులను త్వరలోనే అరెస్టు చేయనున్నట్టు వినీత్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధిక వడ్డీల ఆశజూపి.. భారీ మోసం!
తమ సంస్థలో పెట్టుబడులు పెడితే.. అధిక వడ్డీతో పాటు తక్కువ సమయంలోనే భారీగా ఆర్జించవచ్చని మాయమాటలతో నమ్మించిన దంపతులు బోర్డు తిప్పేసిన ఘటన హైదరాబాద్ ఉప్పల్లో చోటుచేసుకుంది. -
కోల్కతాలో కుప్పకూలిన అయిదంతస్తుల భవనం.. తొమ్మిది మంది మృతి
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఓ అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
హార్డ్డిస్కులను అడవిలో పడేసిన ప్రణీత్రావు!
పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్సైబీ)లోని హార్డ్డిస్కులను కట్టర్లతో కత్తిరించి, వికారాబాద్ అడవిలో పడేసినట్లు రెండోరోజు విచారణలో డీఎస్పీ ప్రణీత్రావు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. -
పెళ్లి కారు, ట్రాక్టర్ ఢీ.. బిహార్లో 9 మంది మృతి
బిహార్లోని ఖగారియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, పెళ్లి కారు ఢీ కొన్న ఘటనలో 9 మంది మరణించారు. -
నకిలీ ఔషధ రాకెట్ కేసులో ఈడీ దాడులు
దేశ రాజధాని దిల్లీలో బయటపడిన నకిలీ ఔషధ రాకెట్ గుట్టును ఛేదించే క్రమంలో ఈడీ దాదాపు 10 ప్రదేశాల్లో దాడులు చేసింది. ముఠా ప్రధాన సూత్రధారులు విపిల్ జైన్, నీరజ్ చౌహన్, సూరజ్ షాత్, అభినవ్, తుషార్ చౌహాన్లతో సహా వారి సహచరుల ఇళ్లల్లోను ఈడీ దాడులు చేసింది. -
రూ.5.73 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఈదులగూడ వద్ద సోమవారం పట్టణం నుంచి కోదాడ వైపు వెళ్తున్న టీఎస్ 09 యూఈ 2479 నంబరు గల బొలేరో వాహనంలో రూ.5.73 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చందనా దీప్తి పేర్కొన్నారు. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్ద చోరీ.. ఆపై అడ్డంగా దొరికారు
ఓ వ్యక్తి మెడలో ఉన్న గొలుసును చోరీ చేసిన ఇద్దరు దొంగలు చివరకు పోలీసుల చేతికి చిక్కి, కటకటాల పాలయ్యారు.