పండుగ పూట విషాదం
‘ఇదిగోరా.. ఇక్కడే ఈ నీటి గుంతలోనే.. నా చేతులతో ఇంట్లో పిండితో చేసిన గణేశుడిని నిమజ్జనం చేసిన..’ అని దోస్తులకు చూపుతూ బాలుడు సంబరంగా చెబుతుండగానే ప్రమాదవశాత్తు పడిపోయాడు. నీటి గుంతలో పడిపోయిన తమ్ముడిని రక్షించుకునేందుకు అక్క దూకగా తానూ చనిపోయింది.
నీటి గుంతలో పడి అక్కాతమ్ముడి మృతి
సిద్దిపేట అర్బన్, న్యూస్టుడే: ‘ఇదిగోరా.. ఇక్కడే ఈ నీటి గుంతలోనే.. నా చేతులతో ఇంట్లో పిండితో చేసిన గణేశుడిని నిమజ్జనం చేసిన..’ అని దోస్తులకు చూపుతూ బాలుడు సంబరంగా చెబుతుండగానే ప్రమాదవశాత్తు పడిపోయాడు. నీటి గుంతలో పడిపోయిన తమ్ముడిని రక్షించుకునేందుకు అక్క దూకగా తానూ చనిపోయింది. దసరా పండుగ రోజు ఈ విషాదం సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరులో చోటుచేసుకుంది. ఇంటి వెలుగులు ఇద్దరూ చనిపోవడంతో ఆ కుటుంబంలో తీరని శోకం అలుముకుంది. వెల్కటూరుకు చెందిన కాటపాక రాజు-కీర్తనకు చందన(9), రితిక్(7) ఇద్దరు పిల్లలున్నారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చిన్నారులు స్థానిక ప్రాథమిక పాఠశాలలో 4, 2వ తరగతులు చదువుతున్నారు. పండుగ పూట ఇంట్లో అమ్మ పిండి వంటలు చేస్తోంది. గోధుమ పిండితో వినాయకుడి ప్రతిమను రితిక్ తయారు చేశాడు. దానిని ఇంటికి సమీపంలో ఉండే నీటి గుంతలో నిమజ్జనం చేసి తిరిగి వచ్చాడు. కొద్దిసేపటికి అతడి స్నేహితులు వచ్చి మాట్లాడగా గణేశుడిని తయారుచేసి, నిమజ్జనం చేసిన విషయాన్ని బాలుడు చెప్పాడు. ఎక్కడ, ఎలా చేశావని మిత్రులు అడగ్గా చూపిస్తానని.. సోదరితో కలిసి మళ్లీ గుంత వద్దకు వచ్చాడు. నిమజ్జనం చేసిన తీరును దోస్తులకు వివరిస్తుండగానే నీటి గుంతలో పడిపోయాడు. తమ్ముడిని రక్షించేందుకు అక్కడ నీటిలోకి దూకగా గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరూ బయటకు రాలేకపోయారు. మిత్రులు వెంటనే పరుగెత్తుకెళ్లి కుటుంబీకులకు చెప్పారు. స్థానిక వ్యక్తి ఒకరు వచ్చి కుంటలో దిగి చిన్నారులను కాపాడేందుకు ప్రయత్నించాడు. రితిక్ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. కొన ఊపిరితో ఉన్న చందనను మిట్టపల్లి శివారులో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాళ్లను కొట్టేందుకు భూమి నుంచి పెద్ద బండరాయిని కొన్నేళ్ల క్రితం తవ్వి తీసేయడంతో గొయ్యి ఏర్పడి వాన నీటితో నిండి, ప్రమాదకారకమైంది. బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం వచ్చి పరామర్శించింది. ఈ విషయమై పట్టణ మూడో ఠాణాలో సంప్రదించగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని, కేసు నమోదు కాలేదని పోలీసులు చెప్పారు.
స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు..
వట్పల్లి, న్యూస్టుడే: కుటుంబీకులు, గ్రామస్థులు దసరా వేడుకల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో స్నానం చేసేందుకు నీటి కుంటలోకి దిగి యువకుడు మృతిచెందాడు. ఎస్సై అంబార్య తెలిపిన వివరాలు.. మండలంలోని పోతులబొగుడ గ్రామానికి చెందిన చిత్రాల మశ్చేందర్ (35) గ్రామ శివారులోని కుంట వద్దకు బుధవారం స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశత్తు నీటిలో మునిగి మరణించాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలోని స్నేహతులు, బంధువుల వద్ద ఆరా తీశారు. స్థానిక కుంట వద్దకు వెళ్లి చూడగా గుట్టుపై మశ్చేందర్ చెప్పులు కనిపించాయి. రాత్రి వరకు ఈతగాళ్లతో గాలించిన ఆచూకీ దొరకలేదు. గురువారం మృతదేహం పైకి తేలి కనిపించడంతో వెలికి తీశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పండగ పూట విషాదం నెలకొనడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM