ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఒకే కుటుంబంలో ముగ్గురి దుర్మరణం

వర్ధన్నపేట మండలం డీసీ తండా వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు.

Updated : 08 Nov 2022 15:00 IST

వర్ధన్నపేట : వర్ధన్నపేట మండలం డీసీ తండా వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రకాశం జిల్లా శంకరాపురానికి చెందిన ఇల్లూరి కృష్ణారెడ్డి(40) వరంగల్‌లోని పెరుకవాడలో స్థిరపడ్డారు. ఇటీవల తమ స్వగ్రామంలో అయ్యప్పస్వాములకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్‌కు కారులో బయలుదేరారు. డీసీ తండా వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు.. రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కృష్ణారెడ్డి, వరలక్ష్మి(35), వెంకటసాయిరెడ్డి(14) అక్కడికక్కడే మృతిచెందారు. రవీందర్ రెడ్డి, లక్ష్మీదేవి, విజ్ఞాన్, హేమలత రెడ్డి, శ్రీధర్ తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని