Andhra News: నిద్రిస్తుండగానే యువతి సజీవ దహనం
నిద్రిస్తున్న మంచంపైనే ఓ యువతి సజీవ దహనమైన ఘటన తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. తణుకు గ్రామీణ సీఐ సీహెచ్ ఆంజనేయులు శనివారం తెలిపిన వివరాల మేరకు..
అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు
హారిక (పాతచిత్రం)
తణుకు, తణుకు గ్రామీణం, న్యూస్టుడే: నిద్రిస్తున్న మంచంపైనే ఓ యువతి సజీవ దహనమైన ఘటన తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. తణుకు గ్రామీణ సీఐ సీహెచ్ ఆంజనేయులు శనివారం తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ముళ్లపూడి శ్రీనివాస్, గజ్జరపు వసంత దంపతుల కుమార్తె హారిక (19) బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. 2003లో వసంత మృతి చెందగా.. శ్రీనివాస్ 2009లో రూపను రెండో వివాహం చేసుకున్నారు. ఈమె కొంతకాలం వైకాపా తణుకు మండలం అధ్యక్షురాలిగా ఉన్నారు. కాగా పుట్టింటి నుంచి వసంతకు రావాల్సిన ఆస్తి కోసం శ్రీనివాస్ కొన్నాళ్ల కిందట కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హారిక మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. వీఆర్వో మహ్మద్మోహిద్దీన్ పాషా, గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా ప్రాంతాన్ని తణుకు గ్రామీణ సీఐతోపాటు ఎస్సై ఎం.రాజకుమార్లు పరిశీలించి వివరాలు సేకరించారు. అయితే చరవాణికి ఛార్జింగ్ పెడుతుండగా షార్టుసర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగిందని హారిక తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించామని, అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ ఆంజనేయులు చెప్పారు. ఇంతకాలం ఆస్తి కోసం ప్రేమగా నటించి.. తీర్పు తమకు అనుకూలంగా రాదనే ఉద్దేశంతో హారికను హత్య చేసి విద్యుత్తు షార్టుసర్క్యూట్గా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె మేనమామ, అమ్మమ్మలు ఆరోపిస్తున్నారు. హారిక తల్లిదండ్రులను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీవెడ్డింగ్ ఫంక్షన్లో వివాదం..యువకుడిని టెర్రస్పై నుంచి తోసేసిన వ్యాపారవేత్త
ఓ ప్రీవెడ్డింగ్ వేడుకలో సరదాగా గడుపుతున్న సమయంలో యువకుల మధ్య జరిగిన చిన్న వివాదం ఓ వ్యక్తికి ప్రాణాంతకంగా మారింది. -
బాలుడిని చంపేసి.. ఆత్మహత్య చేసుకుని..!
చోరీ చేసి.. డబ్బులు పంచుకునే క్రమంలో జరిగిన గొడవలో ఓ యువకుడు బాలుడిని హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
హైదరాబాద్లో అమానుషం.. మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం
చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే ఓ మహిళ.. తెల్లవారుజామున ఇద్దరు యువకుల కంటపడింది. కన్నూమిన్నూ కానకుండా వారు ఆమెపై పాశవికంగా లైంగికదాడికి పాల్పడ్డారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థుల దుర్మరణం
అమెరికాలో శనివారం రాత్రి(భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు తెలంగాణ విద్యార్థులను బలిగొంది. -
పవన్ సభలో చాకుతో యువకుడు
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా భీమవరం ప్రకాశం చౌక్లో ప్రసంగిస్తున్న సమయంలో ఇద్దరి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
ట్రక్కును ఢీకొట్టిన కారు.. రాజస్థాన్లో 9 మంది మృతి
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ కారు ట్రక్కును ఢీకొనడంతో తొమ్మిది మంది మరణించారు. రాజస్థాన్లోని ఝలావాఢ్లో ఆదివారం ఈ ప్రమాదం సంభవించింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు నేత మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లా కేస్కుతుల్-కేశముండి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆదివారం ఓ మావోయిస్టు నేత మృతి చెందాడు. -
వార్డు సచివాలయంలో పట్టుబడ్డ మద్యం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వార్డు సచివాలయంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. -
చంద్రబాబు సభకు వెళ్లారని హత్యాయత్నం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో శనివారం జరిగిన చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడనే అక్కసుతో తెదేపా కార్యకర్తపై వైకాపా మద్దతుదారులు హత్యాయత్నానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
విశాఖ - బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు.. శని, ఆదివారాల్లోనే..!
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
-
ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం.. వెంకయ్యనాయుడుకు ‘పద్మవిభూషణ్’ ప్రదానం
-
‘ఇలాంటి సీఎంను చూసి గర్విస్తున్నా’.. యోగిపై ప్రధాని ప్రశంసలు