పది రోజుల్లో వివాహం.. రోడ్డు ప్రమాదంలో ఇంజినీర్‌ దుర్మరణం

పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడిని రోడ్డు ప్రమాదం కబళించింది. హయత్‌నగర్‌ పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్‌లోని జామ్‌తాడకు చెందిన ఆకాశ్‌ భండారీ(29) తండ్రి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు.

Updated : 24 Nov 2022 05:33 IST

హయత్‌నగర్‌  న్యూస్‌టుడే: పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడిని రోడ్డు ప్రమాదం కబళించింది. హయత్‌నగర్‌ పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్‌లోని జామ్‌తాడకు చెందిన ఆకాశ్‌ భండారీ(29) తండ్రి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నగరానికొచ్చి తల్లి అసీమాతో కలిసి హయత్‌నగర్‌ లెక్చరర్స్‌ కాలనీలో ఉంటున్నాడు. సంఘీ సమీపంలోని లిమినార్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. డిసెంబరు 4న వివాహం జరగాల్సి ఉంది. నాలుగు రోజుల్లో స్వగ్రామం వెళ్లాల్సి ఉండగా.. మంగళవారం ఉదయం విధులకు వెళ్లిన ఆకాశ్‌ రాత్రి 9.30కు ద్విచక్ర వాహనంపై ఓఆర్‌ఆర్‌ మీదుగా ఇంటికి బయలుదేరాడు.  కొహెడ-పెద్దఅంబర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ దగ్గర ఆకాష్‌ స్కూటీ ముందు వెళుతున్న మరో వాహనాన్ని ఢీకొంది. తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. చీకట్లో ముందు వెళ్తున్న భారీ వాహనం కనిపించక ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని