ద్విచక్ర వాహనం ఢీకొని చిన్నారి దుర్మరణం
అప్పటి వరకు సంతోషంగా ఉన్న చిన్నారి ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
లక్ష్మీదేవిపల్లి, న్యూస్టుడే: అప్పటి వరకు సంతోషంగా ఉన్న చిన్నారి ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సరదాగా తనతో పాటు ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని తీసుకెళ్తున్న ఒక్కగానొక్క కుమార్తె కళ్ల ముందే మృతి చెందడంతో ఆ తండ్రి తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. ఈ సంఘటన బుధవారం అనిశెట్టిపల్లి ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు... టేకులపల్లి మండలం తడికలపూడికి చెందిన మహ్మద్ సమీర్, షరీఫా దంపతుల ఏకైక కుమార్తె మహ్మద్ ఫాతిమ ముస్కాన్(2). సమీర్ కోయగూడెం ఓసీలో ఒప్పంద కార్మికుడిగా పని చేస్తున్నారు. భద్రాచలంలో ఉండే వారి బంధువుల ఇంటికి వెళ్లేందుకు సమీర్ కుమార్తె ఫాతిమతో కలిసి బుధవారం ద్విచక్ర వాహనంపై తడికలపూడి నుంచి బయలుదేరారు. ఇదే సమయంలో మణుగూరు సింగరేణి ఓసీలో విధులు నిర్వహించే గగులోత్ రవి, స్నేహితుడు వెంకటేశ్వరరావుతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇల్లెందు వైపు వస్తున్నారు. అనిశెట్టిపల్లి ప్రధాన రహదారి వద్ద ఎదురుగా వస్తున్న సమీర్ ద్విచక్ర వాహనాన్ని రవి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో వాహనంపై ఉన్న ఫాతిమ ఒక్కసారిగా కింద పడటంతో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సమీర్కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆటోలో కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చిన్నారి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు లక్ష్మీదేవిపల్లి పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.