పద్ధతి మారక.. చోరీలు మరువక
చోరీల బాట పట్టిన వారిద్దరూ డ్రైవర్లు.. ఒకరు రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధి మార్చుకోకుండా పోలీసులకు చిక్కాడు. మరొకరు కొవిడ్ కాలంలో వ్యసనాలకు బానిసై చరవాణులు చోరీ చేసి అరెస్టు అయ్యాడు.
పోలీసులకు చిక్కిన ఇద్దరు
6.5 తులాల బంగారు ఆభరణాలు, 107 చరవాణులు స్వాధీనం
అశోక్, కృష్ణల నుంచి స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: చోరీల బాట పట్టిన వారిద్దరూ డ్రైవర్లు.. ఒకరు రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధి మార్చుకోకుండా పోలీసులకు చిక్కాడు. మరొకరు కొవిడ్ కాలంలో వ్యసనాలకు బానిసై చరవాణులు చోరీ చేసి అరెస్టు అయ్యాడు. వేర్వేరు ఘటనల్లో అరెస్ట్ అయిన వీరి నుంచి 6.5 తులాల బంగారు ఆభరణాలతో పాటు 92 చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్రావు వివరాల ప్రకారం.. అల్వాల్లోని కౌకూర్కు చెందిన కారు డ్రైవర్ పరాంకుశం అశోక్ బంజారాహిల్స్ ఠాణా పరిధిలో రెండు ఇళ్లలో ఒకే రోజు చోరీలకు పాల్పడ్డాడు. 6.5 తులాల బంగారు ఆభరణాలు, 20 గ్రాముల వెండి ఆభరణాలు చోరీ చేశాడు. బంజారాహిల్స్ క్రైం పోలీసులు, తూర్పు మండల టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి అశోక్ను అరెస్ట్ చేశారు. చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత అవసరాలకు డబ్బు చాలకపోవడంతో దొంగతనాలు ఎంచుకున్నాడని పోలీసులు వివరించారు. గతంలో నిరక్షరాస్యులైన మహిళల వద్దకు వెళ్లి పాన్, ఆధార్ కార్డులతోపాటు ఇతర ధ్రువీకరణపత్రాలు ఇప్పిస్తానంటూ నమ్మించేవాడు. ఓ మహిళ ఒంటరిగా ఉండటంతో ఆమె మంగళసూత్రం తెంచుకొని పరారయ్యాడు. జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత జీడిమెట్ల, పేట్బషీరాబాద్, చందానగర్ ఠాణాల పరిధిలో ఇళ్లల్లో చోరీలకు పాల్పడి రెండోసారి పీడీ చట్టం కింద అరెస్ట్ అయ్యి తిరిగివచ్చాడు. తాజాగా మరోసారి పోలీసులకు చిక్కాడు. నిందితుడిపై మొత్తం 11 కేసులు ఉన్నాయి.
* కర్నూలు జిల్లా డోన్కు చెందిన ఎస్.కృష్ణ(34) ఆటోడ్రైవర్. అదే ప్రాంతానికి చెందిన షబ్బీర్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ వ్యసనాలకు బానిసయ్యారు. కరోనా వల కృష్ణ ఆర్థికంగా చితికిపోయాడు. చోరీలు చేయాలని కర్ణాటకలోని హుబ్లీకి వెళ్లాడు. అక్కడ కూరగాయల మార్కెట్, బస్టాండ్ల్లో చరవాణులు చోరీ చేసి కర్నూలుకు వచ్చేవాడు. షబ్బీర్ ద్వారా హైదరాబాద్లోని సమీకి విక్రయించేవాడు. తర్వాత హైదరాబాద్లో స్థిరపడి చోరీల బాట పట్టాడు. బోయిన్పల్లి, కంచన్బాగ్, పహాడిషరీఫ్ ఠాణాల పరిధిలో దొంగతనాలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన తూర్పు మండల పోలీసులకు షబ్బీర్, సమి చిక్కారు. 15 చరవాణులు స్వాధీనం చేసుకొని కంచన్బాగ్ పోలీసులకు అప్పగించారు. కృష్ణను అరెస్టు చేసి 92 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్