‘మళ్లీ జన్మ ఉంటే మీ కొడుకుగానే పుడతాను’
‘ప్రియమైన అమ్మానాన్నలకు నేను ఇలా చేసుకోవడం తప్పే. కానీ తప్పడంలేదు. దయచేసి అర్థం చేసుకోగలరు.
తల్లిదండ్రులు మాట్లాడుకోనందునే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి బలవన్మరణం
ఈశ్వరసాయి(పాత చిత్రం)
‘ప్రియమైన అమ్మానాన్నలకు నేను ఇలా చేసుకోవడం తప్పే. కానీ తప్పడంలేదు. దయచేసి అర్థం చేసుకోగలరు. ఇప్పటికైనా ఇద్దరు కలిసి ఉండి మాట్లాడుకోండి. ఇదే నా చివరికోరిక అనుకోండి. నేను మీకు పుట్టడం నా అదృష్టం. కానీ మీకు అది దురదృష్టం. మళ్లీ జన్మ ఉంటే మీ కొడుకుగానే పుడతాను’ అని లేఖ రాసి ఓ విద్యార్థి బలవన్మరణం పొందిన ఘటన వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో చోటుచేసుకుంది.
వేంపల్లె, న్యూస్టుడే: ఉరవకొండకు చెందిన వీరావతి, నాగభూషణం దంపతులకు ఈశ్వరి, ఈశ్వరసాయి ఇద్దరు పిల్లలు. నాగభూషణం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో ప్రైవేట్ పాఠశాలల బస్సుల మేనేజర్గా పనిచేస్తున్నారు. ఈశ్వరసాయి (17) ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు మాట్లాడుకోవడం లేదన్న మానసిక బాధతో గురువారం వసతి గృహంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భోజన విరామ సమయంలో తోటి విద్యార్థులు హాస్టల్గదికి వచ్చి తలుపులు కొట్టగా తీయలేదు. అక్కడే ఉన్న సిబ్బందికి, విద్యార్థుల సంక్షేమ అధికారి ఇమ్రాంషరీఫ్కు సమాచారం అందించి గది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఈశ్వరసాయి ఫ్యాన్కు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు.
విలపిస్తున్న విద్యార్థి తల్లిదండ్రులు
చదువులో టాపర్..: ఈశ్వరసాయి చదువులో టాపర్గా ఉన్నారు. పీయూసీ మొదటి సంవత్సరంలో 10కి 9.8 జీపీఏ సాధించారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ, కష్టపడి చదివే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంపై తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు వేంపల్లె ఆసుపత్రికి చేరుకుని కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ బిడ్డ సూసైడ్నోట్లో రాసిన మేరకు మా ఇద్దరి మధ్య విభేదాలు లేవని, మూడు నెలల నుంచి ఈశ్వరసాయి మానసిక ఒత్తిడికి గురువుతున్నారని, ఈ విషయాన్ని తోటి విద్యార్థులు మాకు ఫోన్చేసి చెప్పారని డైరెక్టర్ సంధ్యారాణికి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్రిజిస్ట్రార్ తస్లీమ మహ్మద్ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం
ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. -
మహిళపై అమానుషానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు!
మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. -
ఏపీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడి అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడు బోయ మహానందిని మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
వైద్య విద్య కోసం కిర్గిజ్స్థాన్ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు.. రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి. -
పంట నష్టాలతో రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు మాకుల తండాలో ఇస్లావత్ చీనా(42) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టం, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రాళ్లు విసిరి.. జెండా కర్రలతో కొట్టి
తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. -
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు
పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?