కుమరాంలో భారీ చోరీ
జామి మండలంలోని కుమరాం పంచాయతీ కల్యాణ నగర్లో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 50 తులాల బంగారం, 50 తులాల వెండి అపహరణకు గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యులు
50 తులాల చొప్పున బంగారం, వెండి అపహరణ'
పరిశీలిస్తున్న సీఐ సింహాద్రినాయుడు తదితరులు
జామి, న్యూస్టుడే: జామి మండలంలోని కుమరాం పంచాయతీ కల్యాణ నగర్లో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 50 తులాల బంగారం, 50 తులాల వెండి అపహరణకు గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్ఎంపీగా సేవలందిస్తున్న పిన్నింటి ప్రసాదరావు ఈనెల 19న తన కుమార్తె, భార్యతో కలిసి బిలాస్పూర్ వెళ్లారు. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం వారి ఇంటి ఆవరణలో ఉన్న మొక్కలకు నీళ్లు పోసేందుకు వచ్చిన స్థానిక మహిళ కర్రి పాపయ్యమ్మ తలుపు తాళాలు తీసి ఉండడాన్ని గమనించింది. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలు తెరిచి ఉండడం, దుస్తులు చిందరవందరగా పడి ఉండడం చూసి వెంటనే గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చింది. ఈక్రమంలో ఎస్.కోట మండలం సీతంపేటలో ఉంటున్న మరో కుమార్తె గాయత్రి విషయం తెలుసుకుని భర్త రాజేష్తో కలసి హుటాహుటిన అక్కడి చేరుకున్నారు. నగలు, వెండి వస్తువులు కనిపించకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ సింహాద్రి నాయుడు, ఎస్సై వీరబాబు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూటీం వచ్చి ఆధారాలు సేకరించింది. యజమాని లేకపోవడంతో ఎంత చోరీకి గురైందో ఇంకా తెలియలేదు. తమకున్న సమాచారం ప్రకారం 50 తులాల బంగారం, 50 తులాల వెండి పోయినట్లు పోలీసులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో వివరాలు తెలుసుకుని, కేసు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.