గుప్తనిధుల పేరుతో మోసం
గుప్తనిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురిని గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
నలుగురు నిందితుల అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ గిరిప్రసాద్, చిత్రంలో సీఐలు
గోదావరిఖని, న్యూస్టుడే: గుప్తనిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురిని గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.5 లక్షల నగదు, ఇత్తడితో తయారు చేసిన రెండు విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసుస్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ గిరిప్రసాద్ వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన అప్పాల లక్ష్మణ్(39) ప్రస్తుతం గోదావరిఖనిలోని తన చిన్నమ్మ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ప్రజల్లో ఉన్న మూఢవిశ్వాసాలను ఆసరాగా చేసుకొని డబ్బు సంపాదించాడు. వచ్చే డబ్బులు సరిపోవడం లేదని సరికొత్త పథకం వేశాడు. తన చిన్నమ్మ కొడుకు లీలమ్ పాండురాజు(38), అతని మిత్రులు గంగారపు వినయ్కుమార్(35), వాసం రాజేశ్(35)లతో ముఠాగా ఏర్పడ్డారు. ఈ క్రమంలోనే గోదావరిఖనికి చెందిన తిరుపతి తన తండ్రి ఆరోగ్యం బాగలేదని లక్ష్మణ్ వద్దకు తీసుకువచ్చాడు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మబలికి వాటిని బయటకు తీసేందుకు రూ.8.5 లక్షలు వసూలు చేశారు. పూజలు చేసి ఇత్తడి విగ్రహాలు అందించగా మోసపోయినట్లు గుర్తించిన బాధితులు లక్ష్మణ్ ఇంటికి వెళ్లి నిలదీయడంతో బెదిరింపులకు దిగారు. అంతకు ముందు ఇదే విధంగా గోదావరిఖనికి చెందిన నీలారపు మహేందర్ను మోసం చేసి రూ.5 లక్షలు వసూలు చేశారు. గుప్తనిధుల పేరుతో మోసం చేస్తున్న ముఠాపై ఫిర్యాదులు రావడంతో నలుగురు నిందితులను సీఐ రమేశ్బాబు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ ముఠా పలువురి నుంచి రూ.28.20 లక్షల వరకు వసూలు చేసినట్లు వివరించారు. వీరినుంచి రూ.1.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. ముఠాను పట్టుకోవడంలో కృషి చేసిన ఒకటో పట్టణ సీఐ రమేశ్బాబు, ప్రసాదరావు, ఎస్సై కె.రమేశ్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. మూఢనమ్మకాలతో మోసపోవద్దని, మోసగాళ్లకు విలువైన వస్తువులు అప్పగించకూడదని ఏసీపీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
-
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’