భార్య హత్య కేసులో భర్త అరెస్టు
భార్య తిట్లు భరించలేక విసుగు చెంది పథకం ప్రకారం భార్యను హత్య చేశానని నిందితుడు అంగీకరించాడు. ఈ మేరకు నిందితుడని అరెస్టు చేసినట్లు కడప గ్రామీణ సీఐ అశోక్రెడ్డి తెలిపారు.
వివరాలు వెల్లడిస్తున్న గ్రామీణ సీఐ అశోక్రెడ్డి, పక్కన ఎస్సైలు, పోలీసులు
కడప నేరవార్తలు, చింతకొమ్మదిన్నె, న్యూస్టుడే : భార్య తిట్లు భరించలేక విసుగు చెంది పథకం ప్రకారం భార్యను హత్య చేశానని నిందితుడు అంగీకరించాడు. ఈ మేరకు నిందితుడని అరెస్టు చేసినట్లు కడప గ్రామీణ సీఐ అశోక్రెడ్డి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. ‘సీకేదిన్నె మండలం ఇందిరానగర్కు చెందిన నరసింహారావు, లక్ష్మీదేవికి కొన్నేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇంటర్ చదువుతున్న కొడుకు ఉన్నాడు. నరసింహారావు కడపలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నాడు. కొడుకు ఎదుటే భార్య భర్తను తిడుతూ, కొడుతూ ఉండేది. భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 23న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంలో నరసింహారావు భార్యను గట్టిగా తోయడంతో వంటగదిలో ఉన్న పదునైనా రాయిపై పడి లక్ష్మీదేవికి గాయాలయ్యాయి. వెంటనే ఆమె గొంతు నొక్కి, బలంగా నేలకేసి కొట్టి హత్య చేశాడు. సాక్ష్యాలను చెరిపేసి ఎవరికీ అనుమానం రాకుండా యథావిధిగా పాఠశాలకు వెళ్లాడు. లక్ష్మీదేవి విగతజీవిగా నేలపై పడి ఉండడం చూసి స్థానికులు నరసింహారావుకు సమాచారం ఇచ్చారు. తన భార్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని అందరినీ నమ్మించాడు. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని సాక్షులను విచారించగా భార్య పెట్టే వేధింపులు భరించలేక భర్తనే హత్య చేశాడని తెలిసింది. అప్పటికే నరసింహారావు పరారీలో ఉన్నాడు. పోలీసులకు దొరికితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో సీకేదిన్నె ఆర్ఐ ఎదుట లొంగిపోయి నేరాన్ని అంగీకరించాడు’ అని సీఐ చెప్పారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేశామన్నారు. సమావేశంలో ఎస్సైలు అరుణ్రెడ్డి, రాజరాజేశ్వరరెడ్డి, విష్ణు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు