చెరుకులపాడు హత్య కేసులో.. నిందితుడి ఆత్మహత్యాయత్నం
చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసు నిందితుడు.. పోలీసుల అదుపులో ఉన్న తెదేపా వర్గీయుడు.. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు మంగళవారం ఆత్మహత్యాయత్నం ఘటన సంచలనంగా మారింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామాంజనేయులు
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే : చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసు నిందితుడు.. పోలీసుల అదుపులో ఉన్న తెదేపా వర్గీయుడు.. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు మంగళవారం ఆత్మహత్యాయత్నం ఘటన సంచలనంగా మారింది. 2017, మే 21న కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం సమీపంలో చెరుకులపాడు నారాయణరెడ్డి, అతని అనుచరుడు సాంబశివుడు ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. నారాయణరెడ్డి అనుచరుడు గొల్ల కృష్ణమోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కృష్ణగిరి పోలీసులు చెరుకులపాడుకు చెందిన బీసన్నగారి రామాంజనేయులు (ఏ1), బోయకోతుల రామానాయుడు (ఏ2)తో సహా 19 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. బెయిల్పై బయటకు వచ్చిన నిందితులను స్వగ్రామంలో ఉండేందుకు పోలీసులు అనుమతించకపోవటంతో వేర్వేరు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఆర్థికంగా చితికిపోయిన వీరు తమ కుటుంబసభ్యులపై ఆధారపడి కాలం వెళ్లదీస్తున్నారు. గత కొంతకాలంగా ఓర్వకల్లు మండలం హుసేనాపురంలో ఉంటున్న రామాంజనేయులుపై మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. కృష్ణగిరి మండలం తొగిర్చేడులో ఉంటున్న బోయకోతుల రామానాయుడుపై ఆరు కేసులు నమోదయ్యాయి. పొలాలు సాగు చేసుకునేందుకు తనను స్వగ్రామంలోకి అనుమతించాలని రామాంజనేయులు మానవ హక్కుల కమిషన్ను సైతం ఆశ్రయించారు. వెల్దుర్తి పోలీసుస్టేషన్లో రామాంజనేయులు, బోయకోతుల రామానాయుడుపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు సన్నద్ధమయ్యారు. కల్లూరు మండలం చిన్నటేకూరులో ఉన్న తన అల్లుడు సురేంద్ర.. ఆంజనేయస్వామి మాల ధరించటంతో పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు రామాంజనేయులు మంగళవారం ఉదయం అక్కడికి వచ్చారు. ఇతని కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు చిన్నటేకూరు చేరుకుని పట్టుకున్నారు. అతను పోలీసుల నుంచి విడిపించుకుని వాహనం కింద దూరగా పట్టుకుని బలవంతంగా అరెస్టు చేసి వాహనంలో ఎక్కించారు. అతని కుటుంబసభ్యులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామాంజనేయులును మొదట ఉలిందకొండ పోలీసుస్టేషన్కు తరలించి అక్కడి నుంచి కర్నూలుకు తీసుకొచ్చారు. అతడిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా పోలీసులు అప్రమత్తంగా లేనిది చూసి క్రిమిసంహారక మందు తాగాడు. విషయం తెలిసిన అతని కుటుంబసభ్యులు ఆసుపత్రికి వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. రామాంజనేయులు అక్క రామాంజమ్మ మాట్లాడుతూ పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, ఆమె బావ ప్రదీప్రెడ్డి తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఏ ఒక్క గ్రామంలో ఉండనీయకుండా పోలీసులు వేధిస్తున్నారన్నారు. నారాయణరెడ్డి సోదరుల కారణంగా తమ కుటుంబాల్లో ఎందరో తాళిబొట్లు తెగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’