అనారోగ్యం భరించలేక రైతు ఆత్మహత్య

అనారోగ్యం భరించలేక సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని నాగసముద్రాలకు చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చామంతుల భూమయ్య (56) కొన్నేళ్లుగా రక్తపోటు, మధుమేహంతో అవస్థలు పడుతున్నాడు.

Updated : 01 Dec 2022 06:51 IST

న్యూస్‌టుడే, కోహెడ: అనారోగ్యం భరించలేక సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని నాగసముద్రాలకు చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చామంతుల భూమయ్య (56) కొన్నేళ్లుగా రక్తపోటు, మధుమేహంతో అవస్థలు పడుతున్నాడు. విరక్తి చెంది ఈ నెల 29న తెల్లవారుజామున ఇంట్లో కలుపు నివారణమందు తాగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న భూమయ్యను భార్య వెంకవ్వ, కొడుకులు.. చికిత్స నిమిత్తం వాహనంలో సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లమని చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని