క్రికెటర్ కాలేక దొంగయ్యాడు
క్రికెట్ అంటే ఇష్టం. కనీసం రంజీ క్రికెటర్గానైనా రాణించాలనుకున్నాడు. జట్టులోకి తీసుకోకుండా ఓ కోచ్ తనను మోసగించాడని లక్ష్యాన్ని పక్కనపెట్టి ఆన్లైన్లో బెట్టింగులకు దిగాడు.
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు
నేరవార్తావిభాగం, న్యూస్టుడే: క్రికెట్ అంటే ఇష్టం. కనీసం రంజీ క్రికెటర్గానైనా రాణించాలనుకున్నాడు. జట్టులోకి తీసుకోకుండా ఓ కోచ్ తనను మోసగించాడని లక్ష్యాన్ని పక్కనపెట్టి ఆన్లైన్లో బెట్టింగులకు దిగాడు. రూ.లక్షల మేర అప్పులు చేసి, అవి తీర్చలేక దొంగగా మారాడు. చోరీల్లో ఆరితేరి రాష్ట్రంలో పలుచోట్ల దోపిడీలకు పాల్పడి పలుమార్లు జైలుకు కూడా వెళ్లాడు. ఇటీవల జిల్లా కేంద్రం, ఎస్.కోట ప్రాంతాల్లో చోరీలు చేసి, పోలీసులకు చిక్కాడు. ఈ కేసు వివరాలను విజయనగరం ఇన్ఛార్జి డీఎస్పీ శ్రీనివాసరావు, చీపురుపల్లి ఇన్ఛార్జి డీఎస్పీ మోహనరావు బుధవారం వెల్లడించారు. చీపురుపల్లి మండలం పత్తికాయవలసకు చెందిన వున్నాన రాంబాబు(28) బెట్టింగులకు పాల్పడి వ్యసనాలకు లోనయ్యాడు. చేసిన అప్పులు తీర్చేందుకు చోరీలకు పాల్పడేవాడు. ఎస్.కోట, విజయనగరం ఒకటో పట్టణం, జామి, రాజాం స్టేషన్లలో అతనిపై కేసులున్నాయి. ప్రత్యేక బృందాలు వెతకగా పత్తికాయవలస కూడలి వద్ద దొరికాడు. అతని నుంచి తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోగా మరో 3 తులాలు రాబట్టాల్సి ఉందని, వాటిని ఇతరుల వద్ద కుదవ పెట్టాడని డీఎస్పీలు తెలిపారు.
పగటిపూట మాత్రమే.. నిందితుడు తాళాలు పగలుగొట్టడు. కానీ చోరీ చేస్తాడు. ఇంటి మనిషి మాదిరిగా పగటిపూట మాత్రమే వెళ్లి తన పని కానిచ్చేసి వెళ్లిపోతాడు. అలా అని దొరికినదంతా దోచుకోడు.. కొంత ఉంచేస్తాడు. ఇంట్లో వారి పనై ఉంటుందనే అనుమానాన్ని కలిగిస్తాడు. తాళాలు పగలగొట్టకుండా, కిటికీలు, గోడలు, ఇతరత్ర ప్రదేశాల్లో ఉంచే తాళం చెవులను వెతికి చోరీలకు పాల్పడతాడని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన ఎస్సైలు సన్యాసినాయుడు, జి.లోవరాజు, కానిస్టేబుళ్లు సీహెచ్.వైకుంఠరావు, వి.సూర్యనారాయణ, వి.శ్రీనివాసరావు, వి.వెంకటరమణను అభినందించారు. సీఐ బి.వెంకటరావు, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్