ఆ నలుగురు... అనంత లోకాలకు!
ఓ ప్రమాదం అంతులేని విషాదం నింపింది. తమ తమ వృత్తుల్లో రాణిస్తున్న నలుగురిని బలితీసుకుంది.
విశాఖ వాసులను బలిగొన్న రోడ్డు ప్రమాదం
ఒడిశాలో దుర్ఘటన
మరియాఖాన్ కబీర్ రాకేష్కుమార్ లక్ష్మీ
ఎం.వి.పి.కాలనీ, ఎండాడ, పెదవాల్తేరు, విశాలాక్షినగర్, కటక్, న్యూస్టుడే: ఓ ప్రమాదం అంతులేని విషాదం నింపింది. తమ తమ వృత్తుల్లో రాణిస్తున్న నలుగురిని బలితీసుకుంది. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో 16 నెంబర్ జాతీయ రహదారిపై జంకియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడోపోకోరి గ్రామం వద్ద గురువారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరందరూ విశాఖపట్నం వాసులు.
ప్రమాదానికి గురైన కారు
మరమ్మతులకు గురైన ఒక లారీని రోడ్డు పక్కన ఆపి ఉంచారు. వేగంగా వచ్చిన వీరి కారు... ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖుర్దా జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతిచెందిన వారిలో విశాఖ నగరం ఎండాడకు చెందిన బ్యుటీషియన్ మరియాఖాన్ (24), విశాలాక్షినగర్కు చెందిన స్టిల్ ఫొటోగ్రాఫర్ రాకేష్కుమార్ అలియాస్ రాఖీ (35), ఎండాడకు చెందిన ఫొటోగ్రాఫర్ కబీర్ (28), మరియాఖాన్ సహాయకురాలు లక్ష్మీ (28) ఉన్నారు. పూరీలో జరగనున్న పెళ్లిలో పాల్గొనేందుకు వీరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మంచు కురుస్తుండడంతో రోడ్డు సరిగా కనిపించకపోవడం, కారు వేగంగా నడపడం ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
పేరున్న బ్యుటీషియన్గా: ఈ నలుగురిలో మరియాఖాన్ పేరున్న బ్యుటీషియన్. ప్రముఖ ఈవెంట్స్లో మేకప్ కాంట్రాక్టులు తీసుకుంటుంది. ఇతర రాష్ట్రాల్లో జరిగే వేడుకలకూ వెళ్తుంటుంది. ఈమె కుటుంబం విశాఖ బీచ్రోడ్డులోని పాండురంగాపురంలో ఉంటుంది. మరియాఖాన్ మాత్రం ఎండాడలోని బహుళ అంతస్తుల భవనం ఎం.కె.గోల్డ్ కోస్ట్లో ఉంటోంది. పాండురంగాపురంలో కూడా ఓ బ్యూటీపార్లర్ నడుపుతున్నట్లు సమాచారం. బ్యుటీషియన్ కోర్సులో శిక్షణ కూడా ఇస్తుంది. తండ్రి మన్సూర్ఖాన్ స్థానికంగా వ్యాపారం చేస్తుంటారు. ఫొటోగ్రాఫర్ కబీర్ ఆఫ్ఘనిస్తాన్కు చెందినవాడు. ఏయూలోనే చదువుకొని ఇక్కడే ఉంటున్నారు. ఫొటోలు తీయటం అలవాటుగా చేసుకొని ఈవెంట్స్లో వీరితో కలిసి వెళ్తుంటాడు. ఇతను కూడా ఎండాడలోని ఎం.కె.గోల్డ్ కోస్ట్లో ఉంటున్నాడు.
అతనే ఆధారం: విశాలాక్షినగర్ బీవీకే కళాశాల ఎదురుగా ఓ అపార్టుమెంట్లో తల్లి మీనాకుమారి(60)తో కలిసి రాకేష్కుమార్ నివాసం ఉంటున్నారు. తండ్రి లేరు. అక్కకు వివాహం అయింది. కుటుంబానికి ఇతనే ఆధారం. డిగ్రీ వరకు చదువుకున్న రాకేష్ హెచ్ఎస్బీసీ సాఫ్ట్వేర్ సంస్థలో వర్క్ఫ్రమ్ హోం చేస్తున్నాడు. ఫొటోగ్రఫీ హాబీ కావటంతో నగరంలో పలువురు స్నేహితులతో కలిసి ఈవెంట్లకు వెళ్తుంటాడు. తనకు పరిచయం ఉన్న మరియా ఖాన్, కబీర్, లక్ష్మీలతో కలిసి వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం స్వామి మాలలో ఉన్నారు.
* ఈ ప్రమాదంలో మృతిచెందిన లక్ష్మీ స్వగ్రామం ఎస్.కోట మండలం పోతనాపల్లి. భర్త పూర్ణామార్కెట్లో ప్లాస్టిక్ హోల్సేల్ దుకాణం నడుపుతున్నాడు. ప్రస్తుతం కారుషెడ్డు దగ్గర నివాసం ఉంటున్నారు. కూతురు ఎంసెట్ లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుంటుండగా, కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు