అప్పుల బాధతో వృద్ధుడి ఆత్మహత్య
మండలంలోని నార్శింపల్లికి చెందిన కుంచపు ఆంజనేయులు (64) అనే వృద్ధుడు అప్పుల బాధ తాళలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆంజనేయులు (దాచిన చిత్రం)
నార్శింపల్లి (తాడిమర్రి), న్యూస్టుడే : మండలంలోని నార్శింపల్లికి చెందిన కుంచపు ఆంజనేయులు (64) అనే వృద్ధుడు అప్పుల బాధ తాళలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల మేరకు.. ఆంజనేయులు గ్రామంలో చీటీలు నిర్వహిస్తుండేవాడు. కొందరు చీటీ సభ్యులు నగదు ఎత్తుకుని నెలనెలా కంతులు సరిగా కట్టడం లేదు. చీటీల కాల పరిమితి ముగిసిన వారు పూర్తి నగదు ఇవ్వాలని ఆంజనేయులుపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. దీని కోసం అందినకాడికి ఆయన అప్పులు చేశారు. గత కొన్ని రోజులుగా అప్పులు తీర్చాలని రుణదాతలు ఒత్తిడి చేస్తుండేవారు. దీంతో మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భోజనం చేసిన తరువాత ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం భార్య రమాదేవి, కొడుకు రవికుమార్ గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఆంజనేయులు వ్యవసాయం కోసం కూడా అప్పులు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరాతీశారు. ఆంజనేయులు కుమారుడు రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆయనకు భార్య రమాదేవి, కుమారులు రవికుమార్, ధనుంజయ ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.