నగల చోరీ నిందితుల అరెస్టు
బంగారు నగలు, నగదు దోచిన ఇద్దరు దొంగలను నేరవిభాగం పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.
గుంటూరు నేరవార్తలు, న్యూస్టుడే : బంగారు నగలు, నగదు దోచిన ఇద్దరు దొంగలను నేరవిభాగం పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. టింకరింగ్ షాపు నిర్వహించే పాతగుంటూరుకు చెందిన షేక్ అలీ, లారీ డ్రైవర్గా పనిచేసే బాలాజీనగర్కు చెందిన చిలకా రత్నరాజు ఒకే వీధిలో నివాసం ఉంటున్నారు. చెడు వ్యసనాలకు బానిసలై సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో అక్టోబర్ 6న పాతగుంటూరులో ద్విచక్రవాహనం చోరీ చేశారు. అదే నెల 24న చౌడవరంలోని ఏటీఎం యంత్రాన్ని గ్యాస్ కట్టర్తో కోసి అందులో నగదు తస్కరించడానికి యత్నించగా బ్యాంకు అలారం మోగడంతో పారిపోయారు. నవంబర్ 20వ తేదీ రాత్రి లక్ష్మీపురంలో ఉన్న మహావీర్ జువెలరీపై వారి కన్నుపడింది. రోడ్డు మీద నుంచి లోపలకు ఉండటంతో చోరీ చేయడానికి సులువుగా ఉంటుందని నిర్ణయించుకున్నారు. గ్యాస్ కట్టర్తో తాళాలు కోసి దుకాణం లోపల ఉన్న బంగారు ఆభరణాలు, నగదు తస్కరించారు. పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. భారీ మొత్తంలో బంగారం చోరీకి గురవ్వడంతో ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ప్రత్యేక దర్యాప్తునకు సీసీఎస్ పోలీసులను ఆదేశించారు. నేరవిభాగ ఏఎస్పీ శ్రీనివాసరావు, ఏఎస్పీ సుప్రజ, డీఎస్పీలు ప్రకాష్బాబు, శ్రీనివాసరావు, సీఐ రాజశేఖర్రెడ్డి ఘటనాస్థలిని పరిశీలించి లోతుగా దర్యాప్తు చేపట్టారు. వేలిముద్రల విభాగ నిపుణులు ఆధారాలు సేకరించారు. వాటి ఆధారంగా షేక్ అలీ, రత్నరాజులు నిందితులుగా నిర్ధరణకు వచ్చారు. చోరీ చేసి నగలు, నగదును బంధువుల ఇంట్లో పెట్టి విజయనగరం, రాజమండ్రి, మారేడుమిల్లిలో తలదాచుకున్నారు. చోరీ చేసిన సొత్తును పంచుకోవడానికి రైలులో గుంటూరుకు చేరుకోగా సమాచారం తెలుసుకున్న పోలీసులు రైల్వేస్టేషన్ వద్ద నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కిలో 167 గ్రాముల బంగారం, రూ.6.35 లక్షల నగదు జప్తు చేసినట్లు తెలిపారు. చోరీకి గురైన సొత్తు, నగదు మరికొంత ఉండాలనే ఆరోపణలపై దర్యాప్తు చేయిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)