పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య
జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. జామికి చెందిన అల్లంకి సురేష్(30) కుమరాం వద్ద ఓ టైలరు దుకాణంలో పని చేస్తున్నాడు.
సురేష్ (పాతచిత్రం)
జామి, న్యూస్టుడే: జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. జామికి చెందిన అల్లంకి సురేష్(30) కుమరాం వద్ద ఓ టైలరు దుకాణంలో పని చేస్తున్నాడు. గతంలో విద్యా వాలంటీరుగా పనిచేసి మానేశాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శనివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో రెండు రోజులపాటు చుట్టుపక్కల వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. ఈక్రమంలో భీమునిపట్నం బీచ్లో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సోమవారం సమాచారం అందడంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. సురేష్ తండ్రి భాస్కరరావు చనిపోగా.. తల్లి రమణమ్మ, భార్య ఝాన్సీ, ఇద్దరు చిన్నపిల్లలకు ఇతనే ఆధారం. పెద్దదిక్కు లేకపోవడంతో వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విశాఖ కేజీహెచ్లో శవపరీక్ష నిర్వహించాక మృతదేహాన్ని జామి తీసుకొచ్చారు.
మనస్తాపానికి గురై వివాహిత..
పాలకొండ, గ్రామీణం, న్యూస్టుడే: మనస్తాపంతో ఓ వివాహిత ప్రాణాలు తీసుకున్న ఘటన పాలకొండ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఇందిరానగర్కాలనీకి చెందిన మహిళకు(32)కు తన భర్త శివతో కొన్నేళ్లుగా మనస్పర్థలున్నాయి. వీరికి 15 ఏళ్ల వయసుగల కుమార్తె ఉంది. కొన్నాళ్ల క్రితం భర్త నుంచి విడిపోయిన ఆమె వేరే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని ఓ పాఠశాలలో చదువుతున్న కుమార్తెను చూసేందుకు ఆదివారం ఆమె సిద్ధమైంది. ఈక్రమంలో ప్రియుడు వద్దని చెప్పడంతో గొడవ జరిగింది. దీంతో ఆరోజు రాత్రి ఇంట్లో పంకాకు ఉరేసుకుని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు స్పందించి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై శివప్రసాద్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్పుర్కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్పై మండిపడుతున్న ఫ్యాన్స్!