విద్యుదాఘాతంతో మహిళ మృతి
విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని మేర్లపాక ఎస్సీ కాలనీలో సోమవారం చోటు చేసుకుంది.
అనాథలైన ముగ్గురు పిల్లలు
భారతి (పాతచిత్రం)
మేర్లపాక (ఏర్పేడు): విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని మేర్లపాక ఎస్సీ కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన భారతి(43) ఇంటిపై దుస్తులు ఆరవేయడానికి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే అడ్డుగా ఉన్న ఓ కమ్మీని పక్కకు జరిపే క్రమంలో ఇంటి ముందు నుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్తు తీగకు కమ్మి తగిలి విద్యుదాఘాతంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఐదేళ్ల కిందట భర్త చనిపోవడంతో గ్రామానికి సమీపంలోని పరిశ్రమలో రోజువారీ కూలీగా పని చేస్తూ ముగ్గురు కుమారులను పోషిస్తోంది. తల్లి మృతితో పిల్లలు అనాథలుగా మారారు. సంఘటన స్థలాన్ని విద్యుత్తుశాఖ అధికారులు పరిశీలించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
అల్లాబక్షు (పాతచిత్రం)
చిల్లకూరు: చిల్లకూరు మండలం పాలిచర్లవారిపాలెం సమీపాన సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు.. తిమ్మనగారిపాలెం చెందిన షేక్ అల్లాబక్షు (57) కూలీగా పనిచేసేవారు. గూడూరులో పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై బయలుదేరిన అతను మధ్యలో పాలిచర్లవారిపాలెం గిరిజన కాలనీ వద్ద మరో వ్యక్తిని ఎక్కించుకున్నారు. కొంతదూరం రాగానే అదే మార్గంలో ఎదురుగా వచ్చిన కారు అదుపుతప్పి వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఇద్దరూ రోడ్డుపై కింద పడిపోగా సుమారు 45 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని వ్యక్తి ఘటనాస్థలంలోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన అల్లాబక్షు చికిత్స నిమిత్తం 108 వాహనంలో గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఎస్సై గోపాల్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?