మద్యం మత్తులో ఘర్షణ.. వృద్ధుడి మృతి
చిత్తు కాగితాలు, ఖాళీ మద్యం సీసాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన ఘర్షణలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.
నిందితుడు నాగరాజు
గాజువాక, న్యూస్టుడే: చిత్తు కాగితాలు, ఖాళీ మద్యం సీసాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన ఘర్షణలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గాజువాక పోలీసుస్టేషన్ పరిధి శ్రీనగర్లోని తుక్కు దుకాణం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. సీఐ ఎల్.భాస్కరరావు కథనం ప్రకారం..విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన దీమర్తి లక్ష్మణరావు(58) శ్రీనగర్లో భార్య చంద్రమ్మతో ఉంటున్నారు. పాత గాజువాక కుంచమాంబ కాలనీకి చెందిన నక్క నాగరాజుతో కలిసి ఉదయం చిత్తు కాగితాలు ఏరుకుని అనంతరం తుక్కు దుకాణం వద్దకు వచ్చారు. పని ముగించుకుని ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ‘నాకు సరకు దక్కకుండా చేస్తున్నావు’ అంటూ పరస్పరం వాదులాడుకున్నారు. ‘నువ్వెంతంటే నువ్వెంత’ అని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కోపం పట్టలేని నాగరాజు.. లక్ష్మణరావు తలను నేలకేసి బాదడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. సమీపంలోని వారు చంద్రమ్మకు సమాచారం ఇవ్వడంతో ఆమె వచ్చి సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. ఆ కాసేపటికే ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నాగరాజు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. సీఐ భాస్కరరావు, ఎస్ఐ సతీష్ విచారణ జరిపారు. భార్య చంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?