భగ్గుమన్న విభేదాల నిప్పు
నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు పోలీస్స్టేషన్ పరిధిలోని కోళ్లబావాపురం గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
యువకుడిపై హత్యాయత్నం
కోళ్లబావాపురంలో పికెటింగ్
పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఇంటిని పరిశీలిస్తున్న ఎస్సై
నందికొట్కూరు, నందికొట్కూరు గ్రామీణం, న్యూస్టుడే: నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు పోలీస్స్టేషన్ పరిధిలోని కోళ్లబావాపురం గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్థర్, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గాల వారు పరస్పర దాడులతో ఈ పరిస్థితి నెలకొంది. ఇటీవల గ్రామానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేను మరోవర్గం వారు నిలదీశారు. వివాదం ముదిరి రెండువర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని ఠాణాలో కేసులు పెట్టుకున్నారు. ఇది సద్దుమణగక ముందే తాజాగా గ్రామంలో ఓ యువకుడిపై హత్యాయత్నం ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భాస్కర్ కుమారుడు నాగరాజు అధికార పార్టీకి చెందిన సభ్యుడైనా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వ్యవసాయం చేసుకుంటూ గడుపుతున్నారు. ఆయన భార్య తన పిల్లలతో పుట్టినిల్లు అలంపూరుకు వెళ్లారు. సోమవారం రాత్రి నాగరాజు ఇంట్లో నిద్రిస్తుండగా తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు బయట గడియపెట్టి కిటికీలోంచి పెట్రోల్ పోసి నిప్పుపెట్టి పరారయ్యారు. మంటలు చెలరేగి ఇళ్లంతా పొగ కమ్ముకుంది. పొగ వాసనకు మేల్కొన్న ఆయన భయంతో కేకలు పెట్టాడు. చుట్ట్టుపక్కలవారు వచ్చి తలుపు తీయడంతో బయటకు వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామాన్ని సందర్శించి ఘటన తీరును పరిశీలించారు. బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గ్రామంలో ఎస్సై ఓబులేసు ఆధ్వర్యంలో పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ