సాంఘిక బహిష్కరణపై ఎట్టకేలకు కేసు నమోదు
ఐదేళ్ల కిందట ప్రత్తిపాడు మండలంలోని పెదగొట్టిపాడులో అగ్రవర్ణాలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని సాంఘిక బహిష్కరణ చేయడంతో సుదీర్ఘ పోరాటం తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఐడియల్ దళిత్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఇద్వా) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గోళ్లమూడి రాజసుందరబాబు తెలిపారు.
ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్న రాజసుందరబాబు
నగరంపాలెం, న్యూస్టుడే: ఐదేళ్ల కిందట ప్రత్తిపాడు మండలంలోని పెదగొట్టిపాడులో అగ్రవర్ణాలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని సాంఘిక బహిష్కరణ చేయడంతో సుదీర్ఘ పోరాటం తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఐడియల్ దళిత్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఇద్వా) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గోళ్లమూడి రాజసుందరబాబు తెలిపారు. స్థానిక ఆంధ్రక్రైస్తవ కళాశాల ఎదురుగా ఉన్న అంబేడ్కర్ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల కిందట నూతన సంవత్సర వేడుకల్లో అగ్రవర్ణాల వారు పెద్దగొట్టిపాడు దళితవాడపై సామూహికంగా దాడికి పాల్పడ్డారని తెలిపారు. ప్రత్తిపాడు పోలీసుస్టేషన్లో 71 మందిపై ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. దళితవాడను అగ్రవర్ణాలవారు సాంఘిక బహిష్కరణ చేశారన్నారు. అప్పటి నుంచి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని అనేక రకాలుగా పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. దీంతో కోర్టును ఆశ్రయించగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. దీంతో సోమవారం స్పందనలో ఫిర్యాదు చేయగా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి వెంటనే జిల్లా ఎస్పీతో మాట్లాడడంతో బుధవారం ప్రత్తిపాడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే 24 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సాంఘిక బహిష్కరణ కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు ఐదేళ్లు పట్టిందన్నారు. కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేసిన జడ్జి, కలెక్టర్, ఎస్పీ, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో బాధితులు కె.మార్తమ, మౌనిక, శ్రావణి, రోజుమేరి, మరియమ్మ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.