కన్నీరు మిగిలి..
పదిహేనేళ్లుగా కార్యకలాపాలు సాగని క్వారీ అది.. అధికారిక అండతో.. అనధికారిక తవ్వకాలకు ఓ చోటా నాయకుడు తెగబడ్డాడు.. రెండు రోజులుగా తవ్వకాలకు తెరలేపాడు.. అక్రమ పేలుళ్లతో ఏకంగా ఇద్దరి చావుకు కారణమయ్యాడు.
అధికార దందా..
కనుపాప పుట్టిన రోజు..
కన్నోళ్లకు పండగ రోజు..
ముద్దులొలికే మాటలు..
మురిపాల మూటలు...
ఇల్లంతా సందడి..
ఆనందాల ఒరవడి..
అత్యవసర క్షణం..
ఆపద ఉరిమిన తరుణం..
చితికిన తనువులు
చెదిరిన బతుకులు
ప్రేమతో కలిసి సాగారు..
కడకు.. కలిసే వెళ్లారు.
ఇప్పుడే వస్తానన్న అమ్మ..
ఇలలోనే లేదని తెలియదు..
ఆడిస్తానని చెప్పిన నాన్న..
ఆప్యాయతకు రాడని తెలియదు..
నిరీక్షణలో పసి మనసు...
నిర్వేదంలో ప్రతి హృదయం
ఈనాడు, కాకినాడ: పదిహేనేళ్లుగా కార్యకలాపాలు సాగని క్వారీ అది.. అధికారిక అండతో.. అనధికారిక తవ్వకాలకు ఓ చోటా నాయకుడు తెగబడ్డాడు.. రెండు రోజులుగా తవ్వకాలకు తెరలేపాడు.. అక్రమ పేలుళ్లతో ఏకంగా ఇద్దరి చావుకు కారణమయ్యాడు. అక్రమ తవ్వకాల వెనక ఎవరున్నారో తెలిసినా.. రాజకీయ ఒత్తిళ్లతో కీలక శాఖల అధికారులు చర్యలకు వెనకాడుతున్నారు. బేరసారాలతో వ్యవహారాన్ని చక్కబెట్టే చర్యల్లో నాయకులు నిమగ్నమయ్యారు.
ప్రాణాల్ని తోడేసిన అధికార దందా..
* ఊహించని ప్రమాదం: రౌతులపూడి మండలం ఎస్.పైడిపాల గ్రామ గిరిజన దంపతులు వరహాలు, లక్ష్మీదుర్గాభవాని. అతడు కూలీగా, ఆమె యానిమేటర్గా పనిచేస్తున్నారు. బుధవారం పెద్ద పాప పుట్టినరోజు కావడంతో ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇంట్లో మరుగుదొడ్డి లేక గ్రామ శివారున మూతపడిన క్వారీ ప్రాంతానికి బుధవారం సాయంత్రం వెళ్లారు. ఊహించని రీతిన ఒక్కసారిగా భారీ పేలుళ్లలో చిక్కుకున్నారు. పెద్దపెద్ద బండరాళ్లు పైన పడడంతో నుజ్జునుజ్జయి తనువు చాలించగా వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు సుదీర్ఘంగా శ్రమించి మృతదేహాలను వెలికి తీశారు.
* అక్రమ పేలుళ్లే: ఎస్.పైడిపాల సమీపంలో మాతయ్యపేట వైపు వెళ్లే మార్గంలో అర ఎకరాకు పైనే నల్లరాయి కొండ ఉంది. కీలక నిర్మాణాలకు నల్లరాయి అవసరం పెరిగి కొందరు దొడ్డిదారి సంపాదనలో పడ్డారు. అధికారిక అండ, రాజకీయ దన్నుతో అక్రమాలకు తెగించారు. ఈ క్రమంలోనే క్వారీ ప్రాంతంలో పలుచోట్ల అనధికారిక తవ్వకాలకు తెరలేచింది. ఓ గ్రామస్థాయి నాయకుడు మరికొందరితో కలిసి దొడ్డిదారిన పేలుడు సామగ్రి తెప్పించి ఈ క్వారీలో అక్రమ తవ్వకాలకు తెరలేపారు.
* తెరవెనుక ఎవరు..?: ప్రమాదం జరిగిన వెంటనే రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. కాకినాడ భూగర్భ గనులశాఖ డీడీ కార్యాలయం నుంచి బృందం వచ్చి పరిశీలించింది. క్వారీ అనధికారికమని గుర్తించినా.. పేలుళ్లకు అనుమతులు లేవని పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు తేల్చినా.. తవ్వకాలకు తెగబడిందెవరో స్పష్టత ఇవ్వలేదు. విచారణ సాగుతోందని వెల్లడించారు. క్వారీ ప్రాంతంలో బాధితులు ఆందోళన చేస్తే న్యాయం చేస్తామని భరోసా ఇచ్చి పంపేశారు. తెరవెనుక ఎవరున్నారో తెలిసినా రాజకీయ ఒత్తిళ్లతో చర్యలకు వెనకాడుతున్నారని తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందన్నది మిస్టరీగా ఉందని.. తవ్వకాలకు ఎవరు పాల్పడ్డారో స్థానికులు చెప్పడం లేదని డీడీ నరసింహారెడ్డి తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరపాల్సి ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. -
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. -
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్