పెళ్లికి ఒత్తిడి చేయడంతోనే దాడి
స్నేహంగా మెలుగుతున్నందుకు చనువుతో పెళ్లి ప్రస్తావన తెచ్చిన యువకుడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన యువతికి గురువారం బెయిలు లభించింది.
స్నేహితుడిపై కత్తి దూసిన యువతికి బెయిలు
చికిత్స పొందుతున్న అశోక్కుమార్
కేపీహెచ్బీకాలనీ, న్యూస్టుడే: స్నేహంగా మెలుగుతున్నందుకు చనువుతో పెళ్లి ప్రస్తావన తెచ్చిన యువకుడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన యువతికి గురువారం బెయిలు లభించింది. పోలీసులు, స్థానికులు, వసతిగృహ నిర్వాహకుల వివరాల ప్రకారం.. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన ఓ చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ).. భార్య, ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంటున్నారు. ఆయన కుమార్తె లక్ష్మీ సౌమ్య(23) బీబీఏ చదివింది. తండ్రితో విభేదాలు రావడంతో ఆర్నెల్ల క్రితం నగరానికి వచ్చింది. క్రికెట్ శిక్షణ, ఉద్యోగ ప్రయత్నం కోసం వచ్చానంటూ కేపీహెచ్బీ నాలుగో రోడ్డులోని శ్రీతనూజ హాస్టల్లో చేరింది. రాత్రి 10 గంటలకే హాస్టల్ గేట్లు మూసేస్తారు. లక్ష్మీ సౌమ్య నిత్యం ఆలస్యంగా చేరుకునేది. హాస్టల్ నిర్వాహకులు ఆమెను ఖాళీ చేయించగా తొమ్మిదో ఫేజ్లో అద్దె గదిలో ఉంటోంది. పేరుకు యువతే అయినా ఆమె వేషధారణ, భాష కాస్త విభిన్నంగా ఉండేది. ఈమె హాస్టల్లో ఉన్నప్పుడు సమీపంలోని దేవీ లగ్జరీ బాయ్స్ హాస్టల్లో గుంటూరుకు చెందిన నాదెండ్ల అశోక్కుమార్(27)తో పరిచయమైంది. ఇతని సోదరి సమీపంలోని హాస్టల్లోనే ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేది. తండ్రి సొంతూరులో ఆటోడ్రైవర్. అశోక్కుమార్, లక్ష్మీ సౌమ్య నిత్యం ఓ టీ స్టాల్ వద్ద కలుసుకుని మాట్లాడుకునేవాళ్లు. ఈక్రమంలో ఆమెకు అశోక్కుమార్ కొంత నగదు ఇచ్చాడు. అలా ఏర్పడిన చనువుకొద్దీ పెళ్లి ప్రస్తావన తెచ్చేవాడు. ఆమె మౌనం వహించేది. ఈనెల 5న అతడి పుట్టినరోజు ఉండటంతో ఖర్చులకు తానిచ్చిన డబ్బులు ఇవ్వమని అడిగాడు. మాటమాట పెరిగి డబ్బులివ్వకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అనడంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. చాకు లాంటి మినీ కట్టర్తో దాడి చేసింది. అతని మెడపై ఎడమ దవడ కిందిభాగంలో తీవ్ర గాయమైంది. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ముఖానికి సంబంధించిన నరం తెగిందని, ముఖం ఎడమ వైపు పక్షవాతం వచ్చిందని, రెండు రోజుల్లో డిశ్ఛార్జ్ అవుతాడని వైద్యులు తెలిపారు.
పరిస్థితులే కారణం: లక్ష్మీ సౌమ్య
తరచూ పెళ్లి ప్రస్తావన తేవడంతోపాటు గొడవ పడేవాడని, వద్దని వారిస్తున్నా వినలేదని, సహనం నశించి దాడి చేశానని, తాను ఇలా తయారవడానికి పరిస్థితులే కారణమని లక్ష్మీ సౌమ్య పోలీసుల దర్యాప్తులో చెప్పినట్లు తెలిసింది. గురువారం పోలీసులు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా బెయిల్ మంజూరైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. -
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి