Crime News: ప్రియురాలిని వేధించాడని ప్రిన్సిపల్‌ని చంపేశాడు

తన ప్రియురాలిని వేధించాడనే కోపంతో పాఠశాల ప్రిన్సిపల్‌ తలపై సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది.

Updated : 17 Dec 2022 08:56 IST

న ప్రియురాలిని వేధించాడనే కోపంతో పాఠశాల ప్రిన్సిపల్‌ తలపై సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. బిలాస్‌పుర్‌కు చెందిన ఉపేంద్ర కౌశిక్‌ అనే యువకుడు ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఆ యువతిని ప్రదీప్‌ (61) అనే స్థానిక ఓ పాఠశాలకు చెందిన ప్రిన్సిపల్‌ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇది తెలిసి గురువారం రాత్రి ఇంటికి వెళ్తున్న ప్రదీప్‌ను కౌశిక్‌ వెంబడించాడు. అతడి ఇంటి గేటు వద్ద వాగ్వాదానికి దిగాడు. తర్వాత అతడి తలపై సుత్తితో మోది హతమార్చాడు. పోలీసులు నిందితుడిని విచారించగా.. ప్రదీప్‌ తన ప్రియురాలిని వేధింపులకు గురిచేసేవాడని అందుకే అతడిని హత్య చేశానని అంగీకరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని