Mancherial: వారం రోజులుగా రెక్కీ..!
మందమర్రి మండలం గుడిపెల్లి (వెంకటాపూర్)లో ఆరుగురు సజీవ దహనమైన ఘటనలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.
రూ.5 వేల పెట్రోల్తో ఆరుగురిని ఆహుతి చేశారు
కిటీకీలు, తలుపుల దగ్గరే శవాలు
పోలీసుల అదుపులో 10 మంది నిందితులు
ఈనాడు డిజిటల్, మంచిర్యాల; న్యూస్టుడే, మందమర్రి పట్టణం: మందమర్రి మండలం గుడిపెల్లి (వెంకటాపూర్)లో ఆరుగురు సజీవ దహనమైన ఘటనలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలికి 8 కి.మీ. దూరంలో ఉన్న సీసీసీ పెట్రోల్ బంక్లో ముగ్గురు వ్యక్తులు రూ.5 వేల పెట్రోల్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్నారు. లక్షెట్టిపేటకు చెందిన వ్యక్తి, ఉట్కూర్కు చెందిన మరో వ్యక్తితో పాటు, గోదావరిఖనిలో అయిదుగురు, ఆటోలో ఉన్న ఇద్దరు, గుడిపెల్లికి చెందిన వ్యక్తి మొత్తం పది మందిని మరిన్ని వివరాల కోసం విచారిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.
లక్షెట్టిపేట, ఉట్కూర్కు చెందిన ఇద్దరు మంచిర్యాలలో ఓ లాడ్జిలో వారం నుంచి ఉంటున్నారు. వారు పలుమార్లు రెక్కీ నిర్వహించిన అనంతరం ఈ నెల 16న శ్రీరాంపూర్కు చెందిన ఆటో మాట్లాడుకుని అప్పటికే సిద్ధం చేసుకున్న డబ్బాల్లో సీసీసీ బంక్లో రాత్రి 9.54 గంటలకు పెట్రోల్ తీసుకున్నారు. గుడిపెల్లికి చెందిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో దగ్గర దారిలో కాకుండా... రసూల్పెల్లి మీదుగా గుడిపెల్లికి 15 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించారు. మార్గంమధ్యలో మద్యం తాగిన వీరు రాత్రి 11.15 గంటలకు గుడిపెల్లి శివారుకు చేరుకున్నారు. 11.45-12.15 సమయంలో బాధితుల ఇంటికి ఉన్న రెండు తలుపుల నుంచి లోపల పెట్రోల్ గుమ్మరించారు. మంటలు రేగాక చుట్టుపక్కల వారు మేల్కొనడంతో పెట్రోల్ డబ్బాలను చింతచెట్టు కింద వదిలి వచ్చిన ఆటోలోనే పరారయ్యారు. అనంతరం లాడ్జికి చేరుకుని 17న అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉట్కూర్కు చెందిన వ్యక్తిపై ఇంతకుముందే హత్య కేసు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి తల్లికి, మంటల్లో కాలిపోయిన వ్యక్తి తమ్ముడికి అక్రమ సంబంధం ఉండడంతో 15 సంవత్సరాల క్రితం ఆయనను హతమార్చినట్లు విచారణలో వెలుగుచూసింది.
సుపారీ తీసుకుని.. తప్పుడు సమాచారం ఇచ్చి..
గుడిపెల్లికి చెందిన ఓ వ్యక్తి దుండగులకు సహకరించినట్లుగా పోలీసులు తేల్చారు. గ్రామంలో మాస పద్మ శివయ్య దంపతులు, శాంతయ్య ఉన్నారా లేదా నిర్ధారించుకుని చెప్పేందుకు ఇతనితో రూ.3 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఘటన జరిగిన రోజు ఫూటుగా తాగి ఉన్న ఆ వ్యక్తి ఇంట్లో ముగ్గురే ఉన్నారని తప్పుడు సమాచారం ఇవ్వడంతో చుట్టం చూపుగా వచ్చిన మౌనిక, ఇద్దరు పిల్లలు కూడా మంటలకు ఆహుతయ్యారు. ఘటన జరిగిన మరుసటి ఉదయం కూడా ఈ వ్యక్తి ఘటన స్థలంలోనే ఉన్నాడని, హంతకులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాడని పోలీసులు గుర్తించారు.
అమ్మ ఒడిలోనే బూడిదైన చిన్నారి
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లిలో అగ్ని కీలలకు ఆహుతైన ఆరుగురు మంటల్లో మండుతూ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంటిద్వారం వరకు వచ్చి మాంసపు ముద్దలుగా మారిన తీరు అందరినీ కలచివేస్తోంది. ఇందులో మౌనిక తన రెండేళ్ల కూతురు ప్రశాంతిని ఒడిలోనే ఉంచుకుని బూడిదైంది. మృతులందరి ఎముకలు, ఇతర శరీర భాగాలు తలుపులు, కిటికీల దగ్గరే ఉన్నాయి. వారంతా ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రయత్నం చేసినా, తలుపు గడియపెట్టి ఉండడంతో బయటపడే అవకాశం లేకుండా పోయిందని భావిస్తున్నారు. కాగా ఘటనలో మృతిచెందిన శాంతయ్య శవం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరీలోనే ఉంది. ఆదివారం సైతం శవాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈయన కుటుంబ సభ్యులు, అనుమానం ఉన్న ఇతర బంధువులను పోలీసులు గోదావరిఖనిలో అదుపులోకి తీసుకున్నారు.
సుమోటోగా స్వీకరించిన హక్కుల కమిషన్...
నారాయణగూడ, న్యూస్టుడే: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గుడిపల్లి ఘటనను ఆదివారం సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి 2023 జనవరి 27వ తేదీలోపు నివేదిక సమర్పించాలని రామగుండం పోలీసు కమిషనర్కు నోటీసులు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ