Crime News: ప్రియుడిని చంపి డ్రమ్ములో తీసుకెళ్లి తగులబెట్టేసింది!

ఛత్తీస్‌గఢ్‌ రాజ్‌నంద్‌గావ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. డబ్బు విషయంలో వివాదం తలెత్తడంతో ఓ ప్రియురాలు తన ప్రియుడిని హతమార్చింది.

Updated : 20 Dec 2022 07:20 IST

త్తీస్‌గఢ్‌ రాజ్‌నంద్‌గావ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. డబ్బు విషయంలో వివాదం తలెత్తడంతో ఓ ప్రియురాలు తన ప్రియుడిని హతమార్చింది. అనంతరం మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి అడవిలోకి తీసుకెళ్లి తగులబెట్టింది. చంద్ర భూషణ్‌ అనే వ్యక్తి కనిపించడం లేదంటూ ఆయన కుటుంబసభ్యులు మూడురోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే కోట్నా పానీ అడవుల్లో రెండు రోజుల క్రితం గుర్తు తెలియని, సగంకాలిన మృతదేహం స్థానికులకు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దానిని స్వాధీనం చేసుకున్నారు.  ఆ మృతదేహం చంద్ర భూషణ్‌దిగా గుర్తించారు.  రాగిణి సాహు అనే మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. చంద్ర భూషణ్‌.. రాగిణి ప్రేమికులు. రాగిణికి కొంతమొత్తం చంద్ర భూషణ్‌ అప్పుగా ఇచ్చాడు. ఈ విషయమై ఇద్దరికీ ఇటీవల విభేదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో చంద్రభూషణ్‌ పలుమార్లు ప్రియురాలిని బ్లాక్‌ మెయిల్‌ చేసి వేధించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన రాగిణి.. నూతన సాహు అనే స్నేహితుడితో కలిసి  చంద్రభూషణ్‌ను హత్య చేసింది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని