Mancherial: ఆమె చెప్పింది.. ఆస్తి ఊరించింది..
వేరే మహిళతో సంబంధం పెట్టుకుని.. తనకు డబ్బులివ్వడంలేదని, పట్టించుకోవడం లేదనే కక్షతో ఆమె తన భర్తను చంపేందుకు పథకం వేసింది.
ప్రియురాలి భర్తే లక్ష్యంగా ఇంటికి నిప్పు..
ఆరుగురి సజీవ దహనం వెనుక ప్రియుడి కుట్ర
ఈనాడు డిజిటల్ - మంచిర్యాల, న్యూస్టుడే - మంచిర్యాల నేరవిభాగం: వేరే మహిళతో సంబంధం పెట్టుకుని.. తనకు డబ్బులివ్వడంలేదని, పట్టించుకోవడం లేదనే కక్షతో ఆమె తన భర్తను చంపేందుకు పథకం వేసింది. ఆస్తి ఆశ చూపి ప్రియుడిని ఉసిగొల్పింది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లిలో శుక్రవారం రాత్రి ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు వ్యక్తులు సజీవదహనమైన కేసు వెనుక కుట్ర ఇది. ఈ కేసులో అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ మంచిర్యాలలో మంగళవారం విలేకరులకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
లక్షెట్టిపేట మండలం ఉట్కూర్కు చెందిన సృజనకు డాక్యుమెంట్ రైటర్ మేడి లక్ష్మణ్తో 2010లో పరిచయం ఏర్పడింది. అతని వద్ద ఆమె తీసుకున్న రూ.4 లక్షల అప్పు వసూలు క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటికే ఆమె భర్త, సింగరేణి ఉద్యోగి అయిన శనిగారపు శాంతయ్య గుడిపెల్లికి చెందిన పద్మతో అదే గ్రామంలో ఉంటూ సహజీవనం చేస్తున్నాడు. తన జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు పద్మకే ఇస్తానంటూ శాంతయ్య తరచూ గొడవపడేవాడు. పలుమార్లు పంచాయితీలూ జరిగాయి. శాంతయ్య జీతభత్యాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలూ తనకే దక్కాలని సృజనతో లక్ష్మణ్ కోర్టులో కేసు వేయించాడు. గొడవల నేపథ్యంలో భర్తపై కక్ష పెంచుకున్న సృజన.. అతడిని హతమార్చాలని నిర్ణయించుకుని లక్ష్మణ్ను ఉసిగొల్పింది. ఉట్కూర్లో తన కుమార్తె మౌనిక పేరిట ఉన్న రూ. 1.50 కోట్ల విలువైన భూమి రాసిస్తానని అతడికి ఆశ చూపడంతో అతడు హత్యకు పథకం రచించాడు.
రెండుసార్లు వాహనంతో హత్యాయత్నం
లక్షెట్టిపేటలో పందుల వ్యాపారం చేసే శ్రీరాముల రమేశ్ (36)ను లక్ష్మణ్ సంప్రదించాడు. రూ.4 లక్షలు ఇస్తానని శాంతయ్యను హత్య చేయాలని కోరాడు. లక్షెట్టిపేటలోని కోమాకుల మహేశ్కు చెందిన బొలేరో వాహనాన్ని కొని రమేశ్కు ఇచ్చాడు. గుడిపెల్లిలో శ్రీను అనే వ్యక్తి ద్వారా ఆ ఊళ్లో ఉండే సమ్మయ్యను సంప్రదించి.. నిత్యం శాంతయ్య, పద్మల కదలికలను చెబితే.. రూ.1.50 లక్షలు ఇస్తామన్నారు. అతడిచ్చిన సమాచారం ప్రకారం నెల కిందట పద్మ, శాంతయ్య మంచిర్యాల నుంచి గుడిపెల్లికి వస్తుండగా రమేశ్ బొలేరోతో ఢీకొట్టే ప్రయత్నం చేసి.. తానే కందకంలో పడిపోయాడు. నాలుగు రోజుల అనంతరం పద్మ, శాంతయ్య మంచిర్యాల ఆసుపత్రి నుంచి ఆటోలో వస్తుండగా మళ్లీ వాహనంతో ఢీకొట్టే ప్రయత్నం చేయగా వారు త్రుటిలో తప్పించుకున్నారు. పద్మకు గాయాలయ్యాయి. హత్యల కోసం రామకృష్ణాపూర్ అంగడిలో రెండు కత్తులు కొన్నా, దొరికిపోతామని ఆ ప్రయత్నం విరమించుకున్నారు. చివరకు పెట్రోల్ పోసి చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 16న మధ్యాహ్నం సమ్మయ్య రమేశ్కు ఫోన్ చేసి.. శాంతయ్య, పద్మ ఇంట్లోనే ఉన్నారని తెలిపాడు. దీంతో లక్ష్మణ్, రమేశ్లు మంచిర్యాలకు చేరుకుని మద్యం తాగారు. శ్రీపతిరాజు అనే వ్యక్తి ఆటోలో మూడు క్యాన్లలో పెట్రోలు తెప్పించారు. గుడిపెల్లి శివారులో వాటిని తీసుకుని.. సమ్మయ్య, రమేశ్లు గ్రామంలోకి వెళ్లారు. లక్ష్మణ్ అదే ఆటోలో మంచిర్యాలకు చేరుకుని ఓ లాడ్జిలో ఉండి ఉదయం లక్షెట్టిపేటకు వెళ్లాడు. మర్నాడు రమేశ్ అతడి వద్దకు వెళ్లి.. మంటల్లో ఆరుగురు చనిపోయారని చెప్పాడు. హత్యల అనంతరం వీరిద్దరూ తప్పించుకుని తిరుగుతుండగా మంచిర్యాల ఓవర్ బ్రిడ్జి వద్ద, శ్రీరాంపూర్ వద్ద సృజన, ఆమె తండ్రి అంజయ్యలను అదుపులోకి తీసుకున్నామని సీపీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ