Telangana News: రూ.1.50 లక్షలు చోరీ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆయన. పాఠాలతోపాటు విద్యార్థులకు నైతిక విలువలు బోధిస్తూ మెరుగైన సమాజ స్థాపనకు కృషి చేయాల్సిన ఆ ఉపాధ్యాయుడు వక్రమార్గం పట్టాడు.
గతంలో ఓ ఉపాధ్యాయురాలికి అసభ్య సందేశాలు
సంగారెడ్డి అర్బన్, న్యూస్టుడే: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆయన. పాఠాలతోపాటు విద్యార్థులకు నైతిక విలువలు బోధిస్తూ మెరుగైన సమాజ స్థాపనకు కృషి చేయాల్సిన ఆ ఉపాధ్యాయుడు వక్రమార్గం పట్టాడు. నేరప్రవృత్తిని అలవర్చుకుని వివాదాస్పదమయ్యాడు. గతంలో ఓ ఉపాధ్యాయురాలి సెల్ఫోనుకు అసభ్యకర సందేశాలు పంపి సస్పెన్షన్కు గురైన అతను తాజాగా సంగారెడ్డిలో రూ.1.50 లక్షలు చోరీ చేశాడు.
డీఎస్పీ రవీంద్రారెడ్డి తెలిపిన వివరాలు.. సంగారెడ్డికి చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగి కె.రాములు ఈ నెల 10న స్థానికంగా ఉన్న ఓ బ్యాంకులో రూ.1.50 లక్షలు డ్రా చేసుకున్నారు. భార్యతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లిన రాములు మార్గంమధ్యలో కూరగాయల కొనుగోలుకు ఆగారు. వారిని బ్యాంకు నుంచి ద్విచక్రవాహనంతో అనుసరిస్తూ వచ్చిన సార సంతోష్ రూ.1.50 లక్షల నగదు ఉన్న సంచిని లాక్కొని పరారయ్యాడు. బాధితుడు అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పరిశీలించిన పోలీసులు డబ్బులు తస్కరించింది జోగిపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సంతోష్గా గుర్తించారు. ఈ నెల 17న నిందితున్ని సంగారెడ్డిలో పట్టుకుని విచారించారు.
దుర్వ్యసనాలకు అలవాటుపడిన ఆయన తన ద్విచక్రవాహనం నంబరు ప్లేటును తిప్పి బిగించుకుని పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నట్టు తేలింది. నాలుగు నెలల క్రితం జిల్లాలోని ఓ ప్రధానోపాధ్యాయురాలి సెల్ఫోన్కు సంతోష్ అసభ్యకర సందేశాలు పంపి ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు సంతోష్ను సస్పెండ్ చేశారు. కొన్ని రోజుల క్రితమే తిరిగి విధుల్లో చేరాడు. అయినా బుద్ధి మార్చుకోని ఆ ఉపాధ్యాయుడు తాజాగా చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కాడు. నిందితుడి నుంచి రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం