Crime News: విలాసాలకు అలవాటుపడి.. అండాల విక్రయం!
విలాసాల రుచి మరిగిన ఓ మహిళ.. ఖర్చుల కోసం ఏకంగా తన అండాలను అమ్ముకుంది. విషయం తెలుసుకొని భర్త ప్రశ్నించడంతో.. చంపేస్తానంటూ అతణ్ని బెదిరించింది.
ప్రశ్నించిన భర్తను చంపేస్తానంటూ బెదిరించిన మహిళ
విలాసాల రుచి మరిగిన ఓ మహిళ.. ఖర్చుల కోసం ఏకంగా తన అండాలను అమ్ముకుంది. విషయం తెలుసుకొని భర్త ప్రశ్నించడంతో.. చంపేస్తానంటూ అతణ్ని బెదిరించింది. విస్తుగొలిపే ఈ ఉదంతం గుజరాత్లోని అమ్రైవాడీ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. నిందితురాలు అనితకు ఐదేళ్ల క్రితం పెళ్లయింది. అత్తమామలతో ఆమె తరచూ గొడవపడేది. అనిత ఒత్తిడితో ఆమె భర్త తన తల్లిదండ్రులకు దూరంగా.. అద్దె గదిలో వేరు కాపురం పెట్టాడు. అయితే భర్త ఆదాయం సరిపోవడం లేదంటూ ఆమె పలుమార్లు గొడవ చేసింది. విసుగుచెందిన భర్త.. ఆమెను వదిలి 2019లో తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడు. తర్వాత సయోధ్య కుదరడంతో కొన్నాళ్లుగా మళ్లీ కలిసి జీవించడం ప్రారంభించారు. అనిత డబ్బు కోసం అండాలు విక్రయించుకుంటున్న సంగతిని తాజాగా ఆమె భర్త గుర్తించాడు. ఇందుకోసం అహ్మదాబాద్లోని ఓ ఏజెంట్తోపాటు తన అత్త ఆమెకు సహకరిస్తున్నట్లు నిర్ధారించుకున్నాడు. ఈ వ్యవహారంపై భార్యను నిలదీశాడు. ఆమె పెద్ద గొడవ చేసింది. విషయం బయటకు చెప్తే చంపేస్తామంటూ బెదిరించింది. దీంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అండాల విక్రయానికి వీలుగా అనిత ఆధార్ కార్డులో పుట్టినతేదీని మార్చుకుందని అందులో పేర్కొన్నాడు. భర్త అనుమతితోనే వాటిని అమ్ముకుంటున్నట్లు ఫోర్జరీ పత్రాలు సృష్టించిందని కూడా తెలిపాడు. 2019 జనవరి నుంచి 2022 జూన్ మధ్య పలుమార్లు ఆమె అండాలను విక్రయించుకుందని పేర్కొన్నాడు. ఈ వ్యవహారంలో పోలీసులు ఫోర్జరీ సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు