బీటెక్ కావాలా.. బీకాం కొంటారా!
ఉత్తీర్ణులుకానివారు, కళాశాల మానేసిన(డ్రాపౌట్లు) విద్యార్థుల సమాచారం సేకరించి నకిలీ ధ్రువపత్రాలు విక్రయించి దాదాపు రూ.5 కోట్ల వరకూ సంపాదించిన హైటెక్ ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ, చైతన్యపురి పోలీసులు అరెస్టు చేశారు.
నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠా పట్టివేత
ఈనాడు- హైదరాబాద్: ఉత్తీర్ణులుకానివారు, కళాశాల మానేసిన(డ్రాపౌట్లు) విద్యార్థుల సమాచారం సేకరించి నకిలీ ధ్రువపత్రాలు విక్రయించి దాదాపు రూ.5 కోట్ల వరకూ సంపాదించిన హైటెక్ ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ, చైతన్యపురి పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఏడుగురు నిందితుల నుంచి 86 నకిలీ ధ్రువపత్రాలు, 71 తెలంగాణ ఇంటర్ బోర్డు సర్టిఫికెట్లు, 10 రబ్బరు స్టాంపులు, ఏడు ఫోన్లు, ఎస్ఎస్సీ మెమోలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. రాచకొండ ఎస్వోటీ డీసీపీ మురళీధర్, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డితో కలిసి రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ మంగళవారం ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు.
నల్గొండ జిల్లా రామన్నపేటకు చెందిన చింతకాయల వెంకటేశ్వర్లు(51) హైదరాబాద్లో రెండు కళాశాలల్లో కరస్పాండెంట్గా పనిచేశాడు. అవి మూసేయడంతో ఆర్థిక ఇబ్బందులతో స్థిరాస్తి వ్యాపారంలోకి దిగాడు. ఇతనికి వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పాత నేరస్థుడు ఆకుల రవి అవినాశ్ అలియాస్ అజయ్(38)తో పరిచయం ఏర్పడింది. తనతో కలిసి నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతావంటూ వెంకటేశ్వర్లును నమ్మించాడు. అప్పటికే తాను పనిచేసిన రెండు కళాశాలల్లో డ్రాపౌట్లు, ఉత్తీర్ణులుకాని విద్యార్థుల జాబితాను వెంకటేశ్వర్లు సేకరించాడు. వారికి ఫోన్లు చేసి అవసరమున్న కోర్సుల్లో నకిలీ సర్టిఫికెట్లు విక్రయించి ఒక్కొక్కరి నుంచి రూ.3-3.5 లక్షలు తీసుకునేవారు. మూడేళ్ల నుంచి ఈ దందా నడిపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్కు చెందిన గృహిణి గండికోట జ్యోతిరెడ్డి(45), నల్గొండ జిల్లా కేతేపల్లికి చెందిన ప్రైవేటు ఉద్యోగి కొండ్రె నవీన్కుమార్(28) మధ్యవర్తులుగా వ్యవహరించేవారు. చైత్యనపురికి చెందిన పెద్దుకొట్ల అభిలాష్కుమార్(25), నల్గొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన బిల్లకంటి కల్యాణ్(23) బీటెక్ పట్టాలు, అసిఫ్నగర్కు చెందిన విజయ్కుమార్(50) బీఎస్సీ, చెంగిచెర్లకు చెందిన గోపిగారి వైశాలి(26) బీకాం సర్టిఫికెట్లు కొనుగోలు చేశారు. నగరంలో కొందరు పెద్దఎత్తున ధ్రువపత్రాలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం ఏడుగుర్ని అరెస్టు చేశారు.
నకిలీవని గుర్తించకుండా జాగ్రత్త
నకిలీ సర్టిఫికెట్లు విక్రయించే ఆకుల రవి కుమార్ వాటిని తనిఖీ చేసినా అసలైనవేనని నమ్మించేందుకు ఒక లింకు ఇచ్చేవాడని పోలీసులు తెలిపారు. ‘‘నిందితులు విక్రయించే ధ్రువపత్రాలను ఆయా యూనివర్సిటీలు, బోర్డుకు సంబంధించిన వ్యక్తులు తనిఖీ చేస్తే కచ్చితంగా నకిలీవని గుర్తిస్తారు. ఉద్యోగాలిచ్చే ప్రైవేటు యాజమాన్యాలు, ఇతర సంస్థలు తనిఖీ చేసినప్పుడు మాత్రం అసలైనవిగా కనిపించేలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ప్రధాన నిందితుడు రవి దొరికితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి’’ అని ఓ అధికారి తెలిపారు. ఈ ముఠా నుంచి నకిలీ సర్టిఫికెట్లు కొనుగోలు చేసిన విద్యార్థులపైనా పోలీసులు కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నలుగురిని నిందితులుగా చేర్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
-
ముంబయి జట్టుకు ఎక్కువ కాలం ఆడితే బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన